Don't Miss!
- News కేంద్రంలోని బీజేపీ, రాష్ట్రంలోని కాంగ్రెస్ సర్కారును ఏకిపారేసిన కేసీఆర్
- Lifestyle చాణక్య నీతి ప్రకారం, ఈ అలవాట్లు మీకు తెలియకుండానే మీ సంపదను పూర్తిగా నాశనం చేస్తాయి...!
- Sports SRH vs RCB: కొంపముంచిన విరాట్ కోహ్లీ జిడ్డు బ్యాటింగ్!
- Technology OnePlus Watch 2 వన్ప్లస్ వాచ్ 2 కొత్త వేరియంట్ విడుదల.. ధర, సేల్ పూర్తి వివరాలు..!
- Finance Jio Cinema Premium: నెలకు 29లతో జియో ప్రీమియం..
- Automobiles వందేభారత్ రైళ్లలో 1 లీటర్ వాటర్ బాటిల్ రద్దు.. రైల్వే శాఖ కీలక నిర్ణయం
- Travel కేవలం రూ. 5వేలతో హిమాచల్ప్రదేశ్లోని ఈ ప్రాంతాలను చుట్టేయొచ్చు..!
రెండేళ్ల క్రితం చనిపోయిన రజని అభిమాని, 7వ తరగతి.. సూపర్ స్టార్ ఏం చేశాడో తెలిస్తే!
Recommended Video
సూపర్ స్టార్ రజనీకాంత్ ఎంత ఎదిగినా తన సక్సెస్ కు కారణమైన అభిమానులని ఎప్పటికి మరచిపోరు. అందుకే ఆయనని కోట్లాది మంది ఆరాధిస్తారు. రజనీకాంత్ ఎపుడూ అభిమానులని దూరం చేసుకోరు. తరచుగా వారితో సమావేశమవుతూనే ఉంటారు. తాజగా ఓ అభిమాని విషయంలో రజని చేసిన పని ఆయనపై మరింత గౌరవం పెంచేలా చేసింది. రెండేళ్ల క్రితం 7వ తరగతి చదువుతున్న అవినాష్ అనే రజనీకాంత్ వీరాభిమాని మరణించాడు. అతడి కోరికని రజని నెరవేర్చాడు.
రోడ్డు ప్రమాదం
రెండేళ్ల క్రితం 7 వతరగతి చదువుతున్న అవినాష్ రోడ్డు ప్రమాదంలో మరణించాడు. అతడు సూపర్ స్టార్ రజనీకాంత్ కు వీరాభిమాని. అవినాష్ అవయవాలని అతడి తల్లిదండ్రులు స్వామినాథన్, లత దానం చేశారు.
అవినాష్ కోరిక
సూపర్ స్టార్ రజనీకాంత్ విషయంలో అవినాష్ కు ఓ కోరిక ఉండేది. దురదృష్టవ శాత్తు మరణించడంతో ఆ కోరిక తీరలేదు. రజనీకాంత్ చిత్రపటాన్ని అవినాష్ పెన్సిల్ ఆర్ట్ వేశాడు. దానిని సూపర్ స్టార్ కు చూపించి ఆటోగ్రాఫ్ తీసుకోవాలని ఆశపడ్డాడు. మరణముతో ఆ కోరిక తీరలేదు.
రజనికి లేఖ
లేఖ ద్వారా విషయం తెలుసుకున్న రజని అవినాష్ తల్లిదండ్రులని ఇటీవల ఇంటికి పిలిపించుకున్నాడు. వారిని రజని ఓదార్చాడు. అవినాష్ గీసిన చిత్ర పటాన్ని రజనికి చూపించారు. అవినాష్ కోరిక మేరకు రజని దానిపై సంతకం చేశారు.
ఆత్మకు శాంతి
ఇప్పుడు తమ కుమారుడి ఆత్మకు శాంతి చేకూరుతుందని అవినాష్ తల్లి దండ్రులు తెలిపారు. అభిమానులకు ఎప్పుడూ చేరువగావుండే హీరో అంటూ సూపర్ స్టార్ గురించి ఆయన అభిమానులు మరోమారు చర్చించుకుంటున్నారు.