Don't Miss!
- Sports RR vs DC: కన్నీటి పర్యంతమైన రియాన్ పరాగ్!
- News గ్యాంగ్స్టర్, రాజకీయ నేత ముఖ్తార్ అన్సారీ గుండెపోటుతో మృతి
- Lifestyle Love Horoscope For April 2024:ఈ రాశులకి ఏప్రిల్ లో LOVE సక్సెస్ అవుతుంది..మరికొందరికి అడ్డంకులు తప్పవు
- Technology రియల్మి కొత్త ఫోన్ టీజర్ విడుదల.. సెగ్మెంట్లోనే సన్నని డిజైన్ సహా కీలక ఫీచర్లు..!
- Automobiles 6 కోట్ల కస్టమర్లతో భారత్లో హోండా తిరుగులేని రికార్డు.. ఎక్కువగా వీటిపైనే క్రేజ్.!!
- Finance Stock Market: లాభాల్లో ముగిసిన సూచీలు.. మార్కెట్ ర్యాలీకి 5 కారణాలివే..
- Travel చారిత్రాత్మకమైన నగరమైన గ్వాలియర్లో సందర్శించాల్సిన ప్రదేశాలివే..!
‘రాణా’కు బ్రేక్-సౌందర్యతో రజనీ ‘కోచ్ అదయన్’
భారీ అంచనాలతో మొదలైన రజనీ 'రాణా" సినిమా ప్రారంభం రోజే రజనీకాంత్ అనారోగ్యం పాలవడంతో....షూటింగ్ కు బ్రేక్ పడిన విషయం తెలిసిందే. రజనీ అనారోగ్యం నుంచి కోలుకున్న తర్వాత ఆ సినిమాను తీద్దామని అనుకున్నప్పటికీ....భారీ యాక్షన్ సన్నివేశాలతో కూడిన ఈ సినిమాలో నటించేందుకు అతని అరోగ్యం సహకరించదని డాక్టర్లు తేల్చి చెప్పడంతో ఈ ప్రాజెక్టు తాజాగా ఆగి పోయింది. మళ్లీ మొదలవుతుందో ? లేదో కూడా తెలియని పరిస్థితి.
ఆ సినిమా సంగతి పక్కన పెడితే...రజనీ తాజగా మరో సినిమాకు కమిట్ అయ్యారు. తన చిన్న కూతురు సౌందర్య దర్శకత్వంలో 'కోచ్ అదయన్" సినిమా చేయబోతున్నారు. త్వరలోనే ఈ సినిమా షూటింగ్ ప్రారంభం కాబోతుంది. ఈ విషయాన్ని సౌందర్య తన ట్విట్టర్ ద్వారా వెల్లడించింది. ఈ సినిమా మొట్ట మొదటి ఇండియన్ 3డి చిత్రంగా రికార్డులకెక్కబోతోంది. హాలీవుడ్ సినిమాలైన అవతార్, టిన్ టిన్ భారీ చిత్రాలకు వాడిన 3డి టెక్నాలజీ కోచ్ అదనయన్ చిత్రానికి వాడుతున్నారు. రాణా దర్శకుడు కె.ఎస్. రవికుమార్ పర్యవేక్షణలో సౌందర్య ఈ చిత్రానికి దర్శకత్వం వహించబోతున్నారు. ఈరోస్ ఎంటర్ టైన్మెంట్ సంస్థ ఈ చిత్రాన్ని నిర్మించనుంది.