twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    ‘రాణా’కు బ్రేక్-సౌందర్యతో రజనీ ‘కోచ్ అదయన్’

    By Bojja Kumar
    |

    భారీ అంచనాలతో మొదలైన రజనీ 'రాణా" సినిమా ప్రారంభం రోజే రజనీకాంత్ అనారోగ్యం పాలవడంతో....షూటింగ్ కు బ్రేక్ పడిన విషయం తెలిసిందే. రజనీ అనారోగ్యం నుంచి కోలుకున్న తర్వాత ఆ సినిమాను తీద్దామని అనుకున్నప్పటికీ....భారీ యాక్షన్ సన్నివేశాలతో కూడిన ఈ సినిమాలో నటించేందుకు అతని అరోగ్యం సహకరించదని డాక్టర్లు తేల్చి చెప్పడంతో ఈ ప్రాజెక్టు తాజాగా ఆగి పోయింది. మళ్లీ మొదలవుతుందో ? లేదో కూడా తెలియని పరిస్థితి.

    ఆ సినిమా సంగతి పక్కన పెడితే...రజనీ తాజగా మరో సినిమాకు కమిట్ అయ్యారు. తన చిన్న కూతురు సౌందర్య దర్శకత్వంలో 'కోచ్ అదయన్" సినిమా చేయబోతున్నారు. త్వరలోనే ఈ సినిమా షూటింగ్ ప్రారంభం కాబోతుంది. ఈ విషయాన్ని సౌందర్య తన ట్విట్టర్ ద్వారా వెల్లడించింది. ఈ సినిమా మొట్ట మొదటి ఇండియన్ 3డి చిత్రంగా రికార్డులకెక్కబోతోంది. హాలీవుడ్ సినిమాలైన అవతార్, టిన్ టిన్ భారీ చిత్రాలకు వాడిన 3డి టెక్నాలజీ కోచ్ అదనయన్ చిత్రానికి వాడుతున్నారు. రాణా దర్శకుడు కె.ఎస్. రవికుమార్ పర్యవేక్షణలో సౌందర్య ఈ చిత్రానికి దర్శకత్వం వహించబోతున్నారు. ఈరోస్ ఎంటర్ టైన్మెంట్ సంస్థ ఈ చిత్రాన్ని నిర్మించనుంది.

    English summary
    This will be the year end's Most Massive news for Superstar Rajinikanth's fans. Soundarya Rajinikanth Ashwin has tweeted few mins back in the Social networking site.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X