Don't Miss!
- News మరో ఎమ్మెల్సీ ఉపఎన్నికకు షెడ్యూల్ విడుదల: బరిలో తీన్మార్ మల్లన్న
- Lifestyle పాలలో తామరవిత్తనాలు కలుపుకొని తాగితే ఇన్ని ప్రయోజనాలుంటాయా..?
- Finance Jio Cinema Premium: నెలకు 29లతో జియో ప్రీమియం..
- Sports RCB: నా గుండె బద్దలైంది- డివిలియర్స్
- Technology యూట్యూబ్కు పోటీగా TV యాప్.. ఫీచర్లు, అల్గారిథమ్ పైన X సీఈవో ఏమన్నారంటే.. ?
- Automobiles వందేభారత్ రైళ్లలో 1 లీటర్ వాటర్ బాటిల్ రద్దు.. రైల్వే శాఖ కీలక నిర్ణయం
- Travel కేవలం రూ. 5వేలతో హిమాచల్ప్రదేశ్లోని ఈ ప్రాంతాలను చుట్టేయొచ్చు..!
'పందెంకోడి' దర్శకుడి చిత్రాన్ని సురేష్ కొండేటి
పందెంకోడి చిత్రంతో తనకంటూ తెలుగులో క్రేజ్ సంపాదించుకుని, అవారా చిత్రంతో దాన్ని మరింత పెంచుకున్న దర్శకుడు లింగ్ స్వామి. ఆయన తదుపరి నిర్మాతగా చేస్తున్న చిత్రం 'వళక్కు ఎన్:18/9'. ఈ చిత్రాన్ని తెలుగులో డబ్ చేసి సురేష్ కొండేటి అందించినున్నారు. 'ప్రేమిస్తే' చిత్ర దర్శకుడు బాలాజీ శక్తివేల్ దర్శకత్వంలో లింగుస్వామి సమర్పణలో ఎస్.కె.పిక్చర్స్ ద్వారా తెలుగు ప్రేక్షకులకు అందించబోతున్నారు. తమిళంలో 'వళక్కు ఎన్:18/9' పేరుతో నిర్మితమవుతోన్న ఈ సినిమాకి తెలుగులో ఇంకా పేరు ఖరారు కాలేదు.
ఇక లింగుస్వామి సమర్పణలో తెరకెక్కుతున్న చిత్రం 'వళక్కు ఎన్ 18/9'కి ఇప్పటికే తమిళంలో మంచి క్రేజ్ వచ్చింది. అందులోనూ బాలాజీ శక్తివేల్ దర్శకుడు కావటం సినిమాకు బాగా కలిసి వచ్చింది. ఈ సినిమా గురించి నిర్మాత మాట్లాడుతూ "నేను నిర్మించిన చిత్రాల్లో 'నాన్న' తప్ప మిగిలినవన్నీ యువతను ఆకట్టుకున్న ప్రేమకథలే. రెండు ప్రేమ జంటలతో అన్ని వర్గాలను ఆకట్టుకునే అంశాలతో 'వళక్కు ఎన్ 18/9' తెరకెక్కింది. ప్రస్తుతం డబ్బింగ్ జరుగుతోంది. శశాంక్ వెన్నెలకంటి సంభాషణలు రాశారు అన్నారు.
ఇక 'ప్రేమిస్తే' దర్శకుడితో మరలా మరో హిట్ చిత్రాన్ని రూపొందిస్తున్నానని ఆనందిస్తున్నాను. శంకర్, మురుగదాస్, లింగుస్వామి వంటి గొప్ప దర్శకులు నిర్మాతలుగా మారి తెరకెక్కిస్తున్న చిత్రాలను మా సంస్థ ద్వారా విడుదల చేయడం హర్షదాయకం. త్వరలో చిత్రాన్ని విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నాను అని సురేష్ కొండేటి తెలిపారు.
అలాగే తమిళంలో 'ఆనందం', 'రన్', 'జి', 'సండైకోళి'(పందెంకోడి), 'పయ్య'(ఆవారా), 'వేట్టై' వంటి చిత్రాలకు దర్శకత్వం వహించిన దర్శకుడు లింగుస్వామి నిర్మాతగా మారి ఇప్పుడు 'ప్రేమిస్తే' కాంబినేషన్తో ఓ ప్రేమకథా చిత్రాన్ని రూపొందిచటం మంచి పరిణామం అని అందరూ అంటున్నారు. ఈ సినిమాకి సంబంధించిన డబ్బింగ్ కార్యక్రమాలు ప్రస్తుతం జరుగుతున్నాయి. శశాంక్ వెన్నెల కంటి ఈ సినిమా కోసం ప్రత్యేకమైన శ్రద్ధ తీసుకుని అద్భుతమైన సంభాషణలు రాశారు. తెలుగు, తమిళ భాషల్లో ఒకేసారి ఈ చిత్రాన్ని విడుదల చేస్తాం' అని అన్నారు.