Don't Miss!
- News కావ్య మారన్ ఆస్తులు ఎంతో తెలుసా - ఒక్కరే వారసురాలు..!!
- Sports DC vs GT: ఆ తప్పిదంతోనే ఓడిపోయాం: శుభ్మన్ గిల్
- Lifestyle పెళ్లైన వ్యక్తితో డేటింగా? కాస్త ముందు..వెనకా ఆలోచించండి..లేదంటే కొంప కొల్లేరే..!
- Technology OPPO Find X7 Ultra కెమెరా రివ్యూ! అద్భుతమైన ఫీచర్లతో, బెస్ట్ కెమెరా ఫోన్!
- Automobiles 323 కి.మీ రేంజ్తో ప్రీమియం ఎలక్ట్రిక్ బైక్ విడుదల.. ధర తెలిస్తే కొనేందుకు ఆలోచిస్తారు..!!
- Finance Market Closing: లాభాల్లో ముగిసిన సెన్సెక్స్-నిఫ్టీ.. స్పీడు పెంచిన బుల్స్..
- Travel కేవలం రూ. 5వేలతో హిమాచల్ప్రదేశ్లోని ఈ ప్రాంతాలను చుట్టేయొచ్చు..!
లండన్లో సూర్య, అల్లు శిరీష్, మోహన్ లాల్ మూవీ.. క్రేజీగా ప్రారంభం!
విలక్షణ తమిళ నటుడు సూర్య, మలయాళ సూపర్స్టార్ మోహన్లాల్, అల్లు శిరీష్, సాయేషా కలిసి నటిస్తున్న చిత్రానికి సంబంధించిన తొలి షెడ్యూల్ షూటింగ్ లండన్లో ప్రారంభమైంది. సూర్యకు ఈ చిత్రం 37వది. ఈ చిత్రానికి కేవీ ఆనంద్ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ చిత్రం ద్వారా బొమన్ ఇరానీ తొలిసారి తమిళంలోకి అడుగుపెడుతున్నారు. లైకా ప్రొడక్షన్ రూపొందిస్తున్న ఈ చిత్రానికి హారీస్ జయరాజ్ సంగీతం అందిస్తున్నారు.
లండన్ మాత్రమే కాకుండా బ్రెజిల్, ఢిల్లీ, యూఎస్, హైదరాబాద్లో షూటింగ్ జరుపుకొనే ఈ చిత్రానికి గేవ్మిక్ యూ ఆరీ సినిమాటోగ్రాఫర్గా వ్యవహరిస్తున్నారు. ఈ చిత్రంలో నటించడంపై హీరోయిన్ సాయేషా తన సంతోషాన్ని ట్విట్టర్లో వ్యక్తం చేశారు. డైనమేట్ సూర్య సరసన నటించే అవకాశం రావడం చాలా ఆనందంగా ఉంది. ఈ చిత్రంలో మోహన్ లాల్ సర్ తో స్క్రీన్ పంచుకొనే అవకాశం రావడం నిజంగా అదృష్టమే అని సాయేషా ట్వీట్లో పేర్కొన్నారు.
ఇదిలా ఉండగా, సెల్వరాఘవన్ దర్శకత్వంలో ఎన్జీకే అనే చిత్రంలో సూర్య నటిస్తున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రంలో రకుల్ ప్రీత్ సింగ్, సాయి పల్లవి నటిస్తున్నారు. ఈ చిత్రం నవంబర్ 7న రిలీజ్ కానున్నది.