Don't Miss!
- News క్యూ నిల్చొని ఓటు వేసిన సూపర్ స్టార్
- Sports PBKS vs MI: అతను అసాధారణ బ్యాటింగ్తో భయపెట్టాడు: హార్దిక్ పాండ్యా
- Lifestyle గుడ్నైట్ సందేశాలను ఇలా సరదాగా పంపుకోండి..
- Technology 40 గంటలకు పైగా బ్యాటరీ బ్యాకప్, ChatGPT వాయిస్ AI సపోర్టుతో నథింగ్ ఇయర్బడ్స్ విడుదల.. సేల్ వివరాలు!
- Automobiles గొప్ప మనసు చాటుకున్న రాఘవ లారెన్స్.. దివ్యాంగులకు టీవీఎస్ స్కూటర్ల పంపిణీ
- Finance Market Closing: నష్టాల్లోకి జారుకున్న సెన్సెక్స్-నిఫ్టీ.. ఆ రెండిటిపైనే అందరి కన్ను..
- Travel ఒంటిమిట్ట శ్రీ కోదండరామస్వామి ఆలయంలో టీటీడీ అన్నప్రసాదం ప్రారంభం..
దెబ్బ తిన్న కాలుతోనే వచ్చి ఓటేసిన స్టార్ హీరో(ఫొటో)
చెన్నై : దెబ్బ తిన్న కాలు నొప్పెడుతున్నా అలాగే వచ్చి ఓటేసారు తమిళ స్టార్ హీరో సూర్య. ఆయన తాజా చిత్రం అంజాన్ సెట్స్ పై ఆయన రీసెంట్ గా పడి దెబ్బతిన్నారు. కాలు జాయింట్ వద్ద దెబ్బ తగిలింది. గోవా లో యాక్షన్ సీక్వెన్స్ తీస్తూండగా ఈ దెబ్బ తగిలింది. అయితే అటువంటిదేమీ లేదని ఆ చిత్రం కో ప్రొడ్యూసర్ ధనుంజయన్ ఫ్యాన్స్ కు మీడియా ద్వారా తెలిపారు. అయితే ఈ రోజు సూర్య దెబ్బ తిన్న కాలుతోనే వచ్చి ఓటేయటంతో ఫ్యాన్స్ ఈ విషయం దాచి పెట్టినందుకు చిత్రం టీమ్ పై మండిపడుతున్నారు.
లింగుస్వామి దర్శకత్వంలో సూర్య నటిస్తున్న యాక్షన్, కమర్షియల్ చిత్రం 'అంజాన్'. సమంత హీరోయిన్. ముంబయి నేపథ్యంలో సాగే ఈ కథలోని ఓ ఐటం సాంగులో హిందీ నటి చిత్రాంగద నటిస్తోంది. 'నవ్వే నా స్పెషాలిటీ.. నేను సిల్క్స్మిత కమ్యూనిటీ..' అంటూ సాగే ఈ పాటను వివేకా రాశారు. ఇటీవలే ముంబయిలో ఈ పాటను చిత్రీకరించారు. ఇందుకోసం రూ.కోటితో సెట్ వేసిందట చిత్ర యూనిట్. ఈ ఒక్క పాట కోసం ఆమె రూ.కోటి పారితోషికం తీసుకున్నట్లు కూడా కోలీవుడ్ వర్గాలు చెబుతున్నాయి.
విద్యుత్ జమ్వాల్, మనోజ్బాజ్పాయ్, వివేక్, బ్రహ్మానందం, సూరి తదితరులు నటిస్తున్నారు. యూటీవీ మోషన్ పిక్చర్స్, తిరుపతి బ్రదర్స్ సంయుక్తంగా దీనిని నిర్మిస్తున్నాయి. యువన్ శంకర్రాజా సంగీతం సమకూర్చుతున్నారు.
'సింగం 2' విజయం తర్వాత సూర్య నటిస్తున్న కొత్త చిత్రానికి లింగుస్వామి దర్శకత్వం వహిస్తున్నారు. మొదట్లో గౌతం మీనన్ సినిమాలో నటించనున్నట్లు ప్రారంభంలో వార్తలు వినిపించాయి. అయితే ఆ సినిమా స్క్రిప్టు మారడంతో తప్పుకున్నాడు సూర్య. రూ.5 కోట్ల పారితోషికం కూడా తిరిగి ఇచ్చేసినట్లు సమాచారం.
లింగు స్వామితో అనుకున్న సినిమా ఆగిన వెంటనే లింగుస్వామి చిత్రంపై దృష్టిపెట్టాడు. ఈ సినిమా ప్రారంభ కార్యక్రమం ఇటీవల చెన్నైలో జరిగింది. రెండు భిన్నమైన పాత్రల్లో సూర్య కనిపించనున్నట్లు సమాచారం. ప్రపంచంలోనే తొలిసారిగా ఈ సినిమా కోసం రెడ్ డ్రాగన్ కెమెరాను వినియోగిస్తున్నామని కెమెరామెన్ సంతోష్శివన్ తెలిపారు. ఒక పాత్రలో సూర్య గడ్డంతో కనిపించనున్నట్లు చిత్రవర్గాలు చెబుతున్నాయి.
ఇక తన కొత్త సినిమా కోసం కమల్హాసన్ నటించిన చిత్రం శీర్షికను సూర్య ఎంచుకున్నారు. 'బిరియాని' తర్వాత వెంకట్ప్రభుతో తెరకెక్కించనున్న చిత్రానికి 'కల్యాణరామన్' అనే పేరు పెట్టారు. ఈ పేరుతో అప్పట్లో కమల్ హీరోగా ఓ చిత్రం వచ్చింది. పేరు పెట్టే ముందు కమల్తోపాటు ఆ చిత్ర దర్శకుడు పంజు అరుణాచలానికి కూడా విషయాన్ని వివరించారట వెంకట్ప్రభు. చిత్రానికి యువన్శంకర్ రాజా బాణీలు సమకూర్చనున్నారు. ఇది రీమేక్ కాదని... పేరు మాత్రమే పాతదని, కథ కొత్తదేనని వెంకట్ప్రభు స్పష్టం చేస్తున్నారు.