Don't Miss!
- Finance Gold Rate Today: బంగారం ప్రియులకు షాక్.. పెరిగిన ధర..!
- News దేవినేని ఉమకు కీలక బాధ్యత అప్పగించిన చంద్రబాబు..!
- Technology వాట్సాప్ కాలింగ్ ఫీచర్ వినియోగిస్తున్నారా.. అయితే ఈ అప్డేట్ మీకోసమే..!!
- Automobiles రూ. 10 లక్షల ధరలో టాటా నెక్సాన్ AMT కొత్త వేరియంట్లు విడుదల.. వివరాలివే.!!
- Sports ఖమ్మం క్లాసెన్..మెదక్ మార్క్రమ్: క్రియేటివిటీ కొట్టేవాడే లేడు భయ్యా
- Lifestyle Lok Sabha Election 2024:మరో 3 నెలల్లో పట్టాభిషేకం ఎవరికి? జ్యోతిష్యం ఏ పార్టీకి స్ట్రాంగ్ గా సపోర్ట్ చేస్తోంది
- Travel చారిత్రాత్మకమైన నగరమైన గ్వాలియర్లో సందర్శించాల్సిన ప్రదేశాలివే..!
క్రేజీ రీమేక్తో సూర్య, కార్తీ మల్టీస్టారర్.. హిందీలో జాన్ అబ్రహాం.. ఫ్యాన్సీ రేటుకు హక్కులు
మలయాళంలో ఇటీవల కాలంలో అద్భుతమైన విజయం సాధించిన చిత్రాల్లో ముందు వరుసలో నిలిచిన సినిమా అయ్యపనుమ్ కోషియమ్. చిన్న చిత్రంగా రిలీజైన మూవీ భాషా భేధంలో లేకుండా దేశవ్యాప్తంగా ప్రతీ ఒక్కరిని ఆకట్టుకొన్నది. అయితే ఈ సినిమా కలిగించిన అద్బుత ఫీలింగ్తో పలు భాషల్లో స్టార్ హీరోలందరూ రీమేక్ రైట్స్ను చేజిక్కించుకొని తమ అదృష్టాన్ని పరీక్షించుకొనేందుకు సిద్దమవుతున్నారు. తమిళ, హిందీ చిత్ర సీమల్లో రీమేక్ కాబోతున్న ఈ చిత్రం గురించి ఆసక్తికరమైన విషయాలు మీకోసం..
మలయాళంలో సంచలన విజయం
మలయాళంలో రూపొందిన అయ్యపనుమ్ కోషియమ్ చిత్రం అనూహ్యమైన విజయం సాధించింది. ఈ చిత్రంలో పృథ్వీరాజ్ సుకుమారన్, బిజు మీనన్ నటించారు. ఆ చిత్రంలో వారిద్దరి పాత్రలు హైలెట్గా నిలిచాయి. పృథ్వీరాజ్, బీజూ నటన గురించి సినీ విమర్శకులు ప్రశంసలు కురిపించారు. దీంతో ఈ సినిమాపై భారీ అంచనాలు పెరిగాయి. అంతేకాకుండా దేశవ్యాప్తంగా అందరి దృష్టిని ఆకర్షించింది.
తమిళంలో సూర్య, కార్తీ
మాస్ ఎంటర్టైనర్గా ముద్ర వేసుకొన్న అయ్యపనుమ్ కోషియమ్ సినిమాను విలక్షణ నటుడు సూర్య చేయబోతున్నారు. ఈ సినిమా కోసం తన తమ్ముడు కార్తీతో కలిసి తొలిసారి నటించనుండటం తమిళ సినీ వర్గాల్లో మరింత ఆసక్తిని రేపింది. అయ్యపనుమ్ కోషియమ్ సినిమాను తమిళంలో రీమేక్ చేయబోతున్నారనే వార్త ట్విట్టర్లో ట్రెండింగ్ మారింది.
తొలిసారి సూర్య, కార్తీ కలిసి
ఇక ఎప్పటి నుంచో తమిళ ప్రేక్షకులకు కార్తీ, సూర్య ఒకే స్క్రీన్లో కనిపిస్తే చూడాలనే కోరికతో ఎదురుచూస్తున్నారు. అందుకు అయ్యపనుమ్ కోషియమ్ చిత్రం వారికి ఆశలను తీర్చడానికి ఉపయోగపడతున్నది. అయ్యప్పన్ పాత్రను సూర్, కోషి క్యారెక్టర్ను కార్తీ పోషిస్తున్నారు. వీరిద్దరి కలిసి నటిస్తున్నారనే వార్త ఫ్యాన్స్ను సంతోషంలో ముంచెత్తింది.
హిందీలో జాన్ అబ్రహం
అయ్యపనుమ్ కోషియమ్ చిత్రానికి బాలీవుడ్ నుంచి భారీగానే పోటీ ఎదురైంది. అయితే చివరికి హిందీ రీమేక్ రైట్స్ను బాలీవుడ్ హీరో జాన్ అబ్రహం దక్కించుకొన్నారు. ఈ చిత్రాన్ని తన సొంత నిర్మాణ సంస్థ జేఏ ఎంటర్టైన్మెంట్ బ్యానర్పై రూపొందనున్నది. ఈ విషయాన్ని స్వయంగా జాన్ అబ్రహం ట్వీట్ చేసి ధృవీకరించారు. ఈ బ్యానర్పై ఆయుష్మాన్ ఖురానాతో వికీ డోనర్, ఆ తర్వాత మద్రాస్ కేఫే, రాకీ హ్యాండ్సమ్, ఫోర్స్ 2, పరమాణు: ది స్టోరి ఆఫ్ పోఖ్రాన్, బాట్లా హౌస్ లాంటి చిత్రాలను నిర్మించి విజయాన్ని చేజిక్కించుకొన్న సంగతి తెలిసిందే.
జాన్ అబ్రహం ట్వీట్
అయ్యపనుమ్ కోషియమ్ గురించి జాన్ అబ్రహం ట్వీట్ చేస్తూ.. యాక్షన్, థ్రిల్, చక్కటి కథ లాంటి అంశాలతో పొందికగా రూపొందింది. అలాంటి ఫీల్గుడ్ స్టోరిని తెరకెక్కించాలనే ఉద్దేశంతో జేఏ ఎంటర్టైన్మెంట్ హిందీ హక్కులను సొంతం చేసుకొన్నది. హిందీలో అంతే మొత్తంలో చక్కటి ఎంగేజ్మెంట్తో సినిమాను తెరకెక్కిస్తాం. ఈ సినిమా చేయబోతున్నందుకు చాలా ఎక్సైటింగ్గా ఉంది అంటూ ట్విట్టర్లో పేర్కొన్నారు.