Don't Miss!
- Finance Gold Bonds: గోల్డ్ బాండ్స్ ప్రీమెచూర్ ధర ప్రకటించిన ఆర్బీఐ.. పూర్తి వివరాలివే..
- News దేశ రాజకీయాల్లో ఆ ఘనత సాధించిన ఒకేఒక్కడు పవన్ కళ్యాణ్
- Automobiles సేఫ్టీలో మహీంద్రా బొలెరో నియోకు కేవలం 1-స్టార్ రేటింగ్.. దీనిపై కంపెనీ ఏమందంటే??
- Technology Realme నుంచి రెండు కొత్త ఫోన్లు లాంచ్ అయ్యాయి! ధర రూ.11,999 కే మొదలు
- Sports ఆ చెత్త నిర్ణయమే ఆర్సీబీ కొంపముంచింది- ఫించ్
- Lifestyle వేసవిలో కడుపులో చల్లగా ఉంచే కీరకాయ పెరుగుపచ్చడి-అన్నం, రోటీ లేదా చపాతీ దేనికైనా...
- Travel ఏపీలోని రైలు ప్రయాణికులకు శుభవార్త..వేసవి ప్రత్యేక రైళ్లు ఆగే స్టేషన్లివే..!
ఎస్పీ బాలసుబ్రమణ్యంకు సుశీల అవార్డుతో సత్కారం
ప్రముఖ గాయకుడు పద్మశ్రీ ఎస్పీ బాలసుబ్రమణ్యం ను మరో అద్బుతమైన అవార్డు వరించింది. ప్రముఖ నేపథ్య గాయని పి.సుశీల తన పేరిట ఏర్పాటు చేసిన అవార్డును పద్మశ్రీ ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం ఆదివారం చెన్నయ్లో అందుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... ఇది తనకు లభించిన అత్యంత అరుదైన అదృష్టమని,సుశీలమ్మ పేరిట పురస్కారం పొందే అర్హత అసలు తనకింకా రాలేదని వినమ్రంగా కృతజ్ఞతలు చెప్పారు.
బాలూను ఘనంగా సత్కరించి న అనంతరం కళారంగానికి ఆయన చేసిన సేవలను ప్ర శంసిస్తూ వారు ప్రసంగించారు. అవార్డు ప్రదానం ముగిసిన తర్వాత యు.కె.మురళి సారథ్యంలో గాయకులు వివిధ భాషల మధుర గీతాలను ఆలపించి ఆహూతులకు వీనులవిందు చేశారు. ఉమామురళి, జ్వాలాదీపక్ల నృత్య ప్రదర్శన అందర్నీ అలరించింది. ఈ కార్యక్రమం ద్వారా అందిన మొత్తాన్ని ఆంధ్రప్రదేశ్ వరద బాధితుల సహాయార్థం అందజేయనున్నట్టు నిర్వాహకులు ప్రకటించారు.
ఇక ఈ అవార్డు ప్రదానోత్సవానికి ప్రముఖనటి సుహాసిని వ్యాఖ్యాతగా వ్యవహరించారు. అలాగే ఈ కార్యక్రమంలో ప్రముఖ సంగీత దర్శకుడు ఎం.ఎస్.విశ్వనాథన్, గాయకులు పి.బి.శ్రీనివాస్, టి.ఎం.సౌందరరాజ న్, మనోలతోపాటు గాయనీమణులు పి.సుశీల, ఎస్.జానకి, ఎల్.ఆర్.ఈశ్వరి, వాణీ జయరాం, ఎస్.పి.శైలజ తదితరులు పాల్గొన్నారు.