Don't Miss!
- Sports క్లాసెన్కు కావ్య మారన్ స్పెషల్ గిఫ్ట్!
- News Atchannaidu: అచ్చెన్నాయుడికి ఎన్నికల వేళ హైకోర్టులో భారీ ఊరట..!
- Finance Ambani-Adani: చేతులు కలిపిన అంబానీ-అదానీ.. 20 ఏళ్లకు అగ్రిమెంట్.. ఆ స్టాక్ దూకుడు..
- Automobiles హ్యుందాయ్ కస్టమర్లకు అదిరిపోయే న్యూస్.. వేసవిలో ప్రత్యేకంగా సర్వీస్ క్యాంప్.. ఎప్పటివరకు అంటే.??
- Travel చారిత్రాత్మకమైన నగరమైన గ్వాలియర్లో సందర్శించాల్సిన ప్రదేశాలివే..!
- Lifestyle నోరూరించే పచ్చి మామిడికాయ గొజ్జు మామిడికాయ కర్రీ వేడివేడి అన్నంతో తింటుంటే ఆహా అనాల్సిందే..
- Technology ఆపిల్ వరల్డ్ వైడ్ డెవలపర్ కాన్ఫరెన్స్ 2024 తేదీ వెల్లడి.. iOS 18, GenAI పై కీలక ప్రకటనలకు అవకాశం..!
ఎస్పీ బాలసుబ్రమణ్యంకు సుశీల అవార్డుతో సత్కారం
ప్రముఖ గాయకుడు పద్మశ్రీ ఎస్పీ బాలసుబ్రమణ్యం ను మరో అద్బుతమైన అవార్డు వరించింది. ప్రముఖ నేపథ్య గాయని పి.సుశీల తన పేరిట ఏర్పాటు చేసిన అవార్డును పద్మశ్రీ ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం ఆదివారం చెన్నయ్లో అందుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... ఇది తనకు లభించిన అత్యంత అరుదైన అదృష్టమని,సుశీలమ్మ పేరిట పురస్కారం పొందే అర్హత అసలు తనకింకా రాలేదని వినమ్రంగా కృతజ్ఞతలు చెప్పారు.
బాలూను ఘనంగా సత్కరించి న అనంతరం కళారంగానికి ఆయన చేసిన సేవలను ప్ర శంసిస్తూ వారు ప్రసంగించారు. అవార్డు ప్రదానం ముగిసిన తర్వాత యు.కె.మురళి సారథ్యంలో గాయకులు వివిధ భాషల మధుర గీతాలను ఆలపించి ఆహూతులకు వీనులవిందు చేశారు. ఉమామురళి, జ్వాలాదీపక్ల నృత్య ప్రదర్శన అందర్నీ అలరించింది. ఈ కార్యక్రమం ద్వారా అందిన మొత్తాన్ని ఆంధ్రప్రదేశ్ వరద బాధితుల సహాయార్థం అందజేయనున్నట్టు నిర్వాహకులు ప్రకటించారు.
ఇక ఈ అవార్డు ప్రదానోత్సవానికి ప్రముఖనటి సుహాసిని వ్యాఖ్యాతగా వ్యవహరించారు. అలాగే ఈ కార్యక్రమంలో ప్రముఖ సంగీత దర్శకుడు ఎం.ఎస్.విశ్వనాథన్, గాయకులు పి.బి.శ్రీనివాస్, టి.ఎం.సౌందరరాజ న్, మనోలతోపాటు గాయనీమణులు పి.సుశీల, ఎస్.జానకి, ఎల్.ఆర్.ఈశ్వరి, వాణీ జయరాం, ఎస్.పి.శైలజ తదితరులు పాల్గొన్నారు.