Don't Miss!
- News కేంద్రంలోని బీజేపీ, రాష్ట్రంలోని కాంగ్రెస్ సర్కారును ఏకిపారేసిన కేసీఆర్
- Lifestyle చాణక్య నీతి ప్రకారం, ఈ అలవాట్లు మీకు తెలియకుండానే మీ సంపదను పూర్తిగా నాశనం చేస్తాయి...!
- Sports SRH vs RCB: కొంపముంచిన విరాట్ కోహ్లీ జిడ్డు బ్యాటింగ్!
- Technology OnePlus Watch 2 వన్ప్లస్ వాచ్ 2 కొత్త వేరియంట్ విడుదల.. ధర, సేల్ పూర్తి వివరాలు..!
- Finance Jio Cinema Premium: నెలకు 29లతో జియో ప్రీమియం..
- Automobiles వందేభారత్ రైళ్లలో 1 లీటర్ వాటర్ బాటిల్ రద్దు.. రైల్వే శాఖ కీలక నిర్ణయం
- Travel కేవలం రూ. 5వేలతో హిమాచల్ప్రదేశ్లోని ఈ ప్రాంతాలను చుట్టేయొచ్చు..!
ఎస్పీ బాలసుబ్రమణ్యంకు సుశీల అవార్డుతో సత్కారం
ప్రముఖ గాయకుడు పద్మశ్రీ ఎస్పీ బాలసుబ్రమణ్యం ను మరో అద్బుతమైన అవార్డు వరించింది. ప్రముఖ నేపథ్య గాయని పి.సుశీల తన పేరిట ఏర్పాటు చేసిన అవార్డును పద్మశ్రీ ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం ఆదివారం చెన్నయ్లో అందుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... ఇది తనకు లభించిన అత్యంత అరుదైన అదృష్టమని,సుశీలమ్మ పేరిట పురస్కారం పొందే అర్హత అసలు తనకింకా రాలేదని వినమ్రంగా కృతజ్ఞతలు చెప్పారు.
బాలూను ఘనంగా సత్కరించి న అనంతరం కళారంగానికి ఆయన చేసిన సేవలను ప్ర శంసిస్తూ వారు ప్రసంగించారు. అవార్డు ప్రదానం ముగిసిన తర్వాత యు.కె.మురళి సారథ్యంలో గాయకులు వివిధ భాషల మధుర గీతాలను ఆలపించి ఆహూతులకు వీనులవిందు చేశారు. ఉమామురళి, జ్వాలాదీపక్ల నృత్య ప్రదర్శన అందర్నీ అలరించింది. ఈ కార్యక్రమం ద్వారా అందిన మొత్తాన్ని ఆంధ్రప్రదేశ్ వరద బాధితుల సహాయార్థం అందజేయనున్నట్టు నిర్వాహకులు ప్రకటించారు.
ఇక ఈ అవార్డు ప్రదానోత్సవానికి ప్రముఖనటి సుహాసిని వ్యాఖ్యాతగా వ్యవహరించారు. అలాగే ఈ కార్యక్రమంలో ప్రముఖ సంగీత దర్శకుడు ఎం.ఎస్.విశ్వనాథన్, గాయకులు పి.బి.శ్రీనివాస్, టి.ఎం.సౌందరరాజ న్, మనోలతోపాటు గాయనీమణులు పి.సుశీల, ఎస్.జానకి, ఎల్.ఆర్.ఈశ్వరి, వాణీ జయరాం, ఎస్.పి.శైలజ తదితరులు పాల్గొన్నారు.