Don't Miss!
- News ఫోన్ ట్యాపింగ్ కేసు: మాజీ డీసీపీ రాధాకిషన్ రావుకు 14 రోజుల రిమాండ్
- Sports RCB vs KKR: చెలరేగిన కోహ్లీ, కార్తీక్.. కేకేఆర్ ముందు భారీ లక్ష్యం!
- Automobiles గిఫ్ట్ అంటే అబ్బాయిలే ఇవ్వాలా.??.. పెళ్లిలో వరుడికి వధువు అదిరిపోయే బైక్ గిఫ్ట్.. వైరల్ వీడియో చూసేయండి
- Technology 32MP+32MP సెల్ఫీ కెమెరాలతో షియోమీ కొత్త స్మార్ట్ఫోన్.. స్పెసిఫికేషన్లు, ఫీచర్ల వివరాలు..!
- Lifestyle Human Brain Size రోజు రోజుకు పెరుగుతున్న మానవ మెదడు సైజు, రాబోవు కాలంలో బహుషా ఈ వ్యాధులు ఉండవకపోవచ్చు..
- Finance Shapoorji Pallonji IPO: షాపూర్జీ పల్లోంజీ గ్రూప్ నుంచి భారీ ఐపీఓ..
- Travel నహర్ఘర్ కోట దెయ్యాల కోటగా ఎందుకు మారింది? ఈ స్టోరీ తెలిస్తే ఆశ్చర్యపోతారు!
ఎస్పీ బాలసుబ్రమణ్యంకు సుశీల అవార్డుతో సత్కారం
ప్రముఖ గాయకుడు పద్మశ్రీ ఎస్పీ బాలసుబ్రమణ్యం ను మరో అద్బుతమైన అవార్డు వరించింది. ప్రముఖ నేపథ్య గాయని పి.సుశీల తన పేరిట ఏర్పాటు చేసిన అవార్డును పద్మశ్రీ ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం ఆదివారం చెన్నయ్లో అందుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... ఇది తనకు లభించిన అత్యంత అరుదైన అదృష్టమని,సుశీలమ్మ పేరిట పురస్కారం పొందే అర్హత అసలు తనకింకా రాలేదని వినమ్రంగా కృతజ్ఞతలు చెప్పారు.
బాలూను ఘనంగా సత్కరించి న అనంతరం కళారంగానికి ఆయన చేసిన సేవలను ప్ర శంసిస్తూ వారు ప్రసంగించారు. అవార్డు ప్రదానం ముగిసిన తర్వాత యు.కె.మురళి సారథ్యంలో గాయకులు వివిధ భాషల మధుర గీతాలను ఆలపించి ఆహూతులకు వీనులవిందు చేశారు. ఉమామురళి, జ్వాలాదీపక్ల నృత్య ప్రదర్శన అందర్నీ అలరించింది. ఈ కార్యక్రమం ద్వారా అందిన మొత్తాన్ని ఆంధ్రప్రదేశ్ వరద బాధితుల సహాయార్థం అందజేయనున్నట్టు నిర్వాహకులు ప్రకటించారు.
ఇక ఈ అవార్డు ప్రదానోత్సవానికి ప్రముఖనటి సుహాసిని వ్యాఖ్యాతగా వ్యవహరించారు. అలాగే ఈ కార్యక్రమంలో ప్రముఖ సంగీత దర్శకుడు ఎం.ఎస్.విశ్వనాథన్, గాయకులు పి.బి.శ్రీనివాస్, టి.ఎం.సౌందరరాజ న్, మనోలతోపాటు గాయనీమణులు పి.సుశీల, ఎస్.జానకి, ఎల్.ఆర్.ఈశ్వరి, వాణీ జయరాం, ఎస్.పి.శైలజ తదితరులు పాల్గొన్నారు.