Don't Miss!
- Sports RR vs DC: కన్నీటి పర్యంతమైన రియాన్ పరాగ్!
- News గ్యాంగ్స్టర్, రాజకీయ నేత ముఖ్తార్ అన్సారీ గుండెపోటుతో మృతి
- Lifestyle Love Horoscope For April 2024:ఈ రాశులకి ఏప్రిల్ లో LOVE సక్సెస్ అవుతుంది..మరికొందరికి అడ్డంకులు తప్పవు
- Technology రియల్మి కొత్త ఫోన్ టీజర్ విడుదల.. సెగ్మెంట్లోనే సన్నని డిజైన్ సహా కీలక ఫీచర్లు..!
- Automobiles 6 కోట్ల కస్టమర్లతో భారత్లో హోండా తిరుగులేని రికార్డు.. ఎక్కువగా వీటిపైనే క్రేజ్.!!
- Finance Stock Market: లాభాల్లో ముగిసిన సూచీలు.. మార్కెట్ ర్యాలీకి 5 కారణాలివే..
- Travel చారిత్రాత్మకమైన నగరమైన గ్వాలియర్లో సందర్శించాల్సిన ప్రదేశాలివే..!
విక్రమ్ తో 'కలర్స్' స్వాతి?
'మా' టీవీలో కలర్స్ ప్రోగ్రామ్ ద్వారా పాపులర్ అయిన స్వాతి, కృష్ణవంశీ దర్శకత్వంతో వచ్చిన 'డేంజర్' చిత్రం ద్వారా కథానాయిగా పరిచయమయింది. అటుపై 'ఆడవారి మాటలకు అర్థాలే వేరులే' సినిమాలో పూజగా వెంకటేష్ వెంట పడే అమ్మాయిగా నటించి మెప్పించింది. మంచి అవకాశాల కోసం ఎదురుచూస్తున్న స్వాతికి కోలీవుడ్ నుండీ పిలుపు వచ్చింది. తమిళ నటుడు 'జై' సరసన 'సుబ్రమణ్యపురం' చిత్రంలో నటించి తన హావభావాలతో ఆకట్టుకుంది. ఈ సినిమా తెలుగు లో కూడా 'అనంతపురం 1980' పేరుతో డబ్ అయింది.
తెలుగులో ఆమె 'మహి మహి' అంటూ అల్లరి చేసిన 'అష్టాచెమ్మా' చిత్రం చిన్న సినిమాగా విడుదలయి పెద్ద విజయాన్ని సాధించింది. అంతే కాకుండా ఆమెకు ఫిల్మ్ ఫేర్ అవార్డును తెచ్చిపెట్టింది. ఇటీవలే విడుదలయిన 'కలవరమాయే మదిలో' చిత్రంలో కూడా మంచి మార్కులే కొట్టేసింది. ఇక పై మంచి స్క్రిప్ట్ వస్తేనే సినిమాలు చేస్తానన్న స్వాతి కలనిజమవబోతోంది. విశ్వసనీయ కథనం ప్రకారం స్వాతి 'చియాన్' విక్రమ్ సరసన ఓ సినిమాలో నటించబోతున్నట్టు సమాచారం. దీనికి 'ఆడవారి మాటలకు అర్థాలే వేరులే', '7/g బృందావన కాలనీ' లాంటి హిట్ సినిమాల దర్శకుడు సెల్వరాఘవన్ దర్శకత్వం వహిస్తున్నారు. ఇదే కాకుండా 'సుబ్రమణ్యపురం' ఫేం 'జై' సరసన కూడా ఓ చిత్రంలో నటించబోతోంది.