Don't Miss!
- News ఎమ్మెల్యే రాజా సింగ్ పై కేసు నమోదు
- Sports PBKS vs MI: రోహిత్ శర్మ ట్రేడ్ మార్క్ సిక్సర్.. హార్దిక్ రియాక్షన్ వైరల్! వీడియో
- Lifestyle గుడ్నైట్ సందేశాలను ఇలా సరదాగా పంపుకోండి..
- Technology 40 గంటలకు పైగా బ్యాటరీ బ్యాకప్, ChatGPT వాయిస్ AI సపోర్టుతో నథింగ్ ఇయర్బడ్స్ విడుదల.. సేల్ వివరాలు!
- Automobiles గొప్ప మనసు చాటుకున్న రాఘవ లారెన్స్.. దివ్యాంగులకు టీవీఎస్ స్కూటర్ల పంపిణీ
- Finance Market Closing: నష్టాల్లోకి జారుకున్న సెన్సెక్స్-నిఫ్టీ.. ఆ రెండిటిపైనే అందరి కన్ను..
- Travel ఒంటిమిట్ట శ్రీ కోదండరామస్వామి ఆలయంలో టీటీడీ అన్నప్రసాదం ప్రారంభం..
విక్రమ్ తో 'కలర్స్' స్వాతి?
'మా' టీవీలో కలర్స్ ప్రోగ్రామ్ ద్వారా పాపులర్ అయిన స్వాతి, కృష్ణవంశీ దర్శకత్వంతో వచ్చిన 'డేంజర్' చిత్రం ద్వారా కథానాయిగా పరిచయమయింది. అటుపై 'ఆడవారి మాటలకు అర్థాలే వేరులే' సినిమాలో పూజగా వెంకటేష్ వెంట పడే అమ్మాయిగా నటించి మెప్పించింది. మంచి అవకాశాల కోసం ఎదురుచూస్తున్న స్వాతికి కోలీవుడ్ నుండీ పిలుపు వచ్చింది. తమిళ నటుడు 'జై' సరసన 'సుబ్రమణ్యపురం' చిత్రంలో నటించి తన హావభావాలతో ఆకట్టుకుంది. ఈ సినిమా తెలుగు లో కూడా 'అనంతపురం 1980' పేరుతో డబ్ అయింది.
తెలుగులో ఆమె 'మహి మహి' అంటూ అల్లరి చేసిన 'అష్టాచెమ్మా' చిత్రం చిన్న సినిమాగా విడుదలయి పెద్ద విజయాన్ని సాధించింది. అంతే కాకుండా ఆమెకు ఫిల్మ్ ఫేర్ అవార్డును తెచ్చిపెట్టింది. ఇటీవలే విడుదలయిన 'కలవరమాయే మదిలో' చిత్రంలో కూడా మంచి మార్కులే కొట్టేసింది. ఇక పై మంచి స్క్రిప్ట్ వస్తేనే సినిమాలు చేస్తానన్న స్వాతి కలనిజమవబోతోంది. విశ్వసనీయ కథనం ప్రకారం స్వాతి 'చియాన్' విక్రమ్ సరసన ఓ సినిమాలో నటించబోతున్నట్టు సమాచారం. దీనికి 'ఆడవారి మాటలకు అర్థాలే వేరులే', '7/g బృందావన కాలనీ' లాంటి హిట్ సినిమాల దర్శకుడు సెల్వరాఘవన్ దర్శకత్వం వహిస్తున్నారు. ఇదే కాకుండా 'సుబ్రమణ్యపురం' ఫేం 'జై' సరసన కూడా ఓ చిత్రంలో నటించబోతోంది.