Don't Miss!
- Sports RR vs DC: కన్నీటి పర్యంతమైన రియాన్ పరాగ్!
- News గ్యాంగ్స్టర్, రాజకీయ నేత ముఖ్తార్ అన్సారీ గుండెపోటుతో మృతి
- Lifestyle Love Horoscope For April 2024:ఈ రాశులకి ఏప్రిల్ లో LOVE సక్సెస్ అవుతుంది..మరికొందరికి అడ్డంకులు తప్పవు
- Technology రియల్మి కొత్త ఫోన్ టీజర్ విడుదల.. సెగ్మెంట్లోనే సన్నని డిజైన్ సహా కీలక ఫీచర్లు..!
- Automobiles 6 కోట్ల కస్టమర్లతో భారత్లో హోండా తిరుగులేని రికార్డు.. ఎక్కువగా వీటిపైనే క్రేజ్.!!
- Finance Stock Market: లాభాల్లో ముగిసిన సూచీలు.. మార్కెట్ ర్యాలీకి 5 కారణాలివే..
- Travel చారిత్రాత్మకమైన నగరమైన గ్వాలియర్లో సందర్శించాల్సిన ప్రదేశాలివే..!
శింబు పెళ్లి కోసం అథివరధర్ సహాయం కోరిన టి రాజేందర్
తమిళ స్టార్ శింబు తన సినిమాలకు సంబంధించిన వార్తలకంటే వివాదాలు, ప్రేమ, పెళ్లి గురించిన వార్తలతోనే ఎక్కువగా వార్తల్లో ఉంటున్నారు. గతవారం శింబుకు సంబంధించిన ఓ విషయం పెద్దకాంట్రవర్సీ అయింది. నిర్మాత సురేష్ కామాచ్చి వెంకట్ ప్రభు దర్శకత్వంలో శింబు హీరోగా 'మానాడు' అనే సినిమా చేయాలనుకున్నారు. అయితే ఈ ప్రాజెక్ట్ ప్రకటించి సంవత్సరం అయినా శింబు డేట్స్ ఇవ్వకపోవడంతో అతడిని ఈ ప్రాజెక్ట్ నుంచి తప్పిస్తున్నట్లు ప్రకటించారు.
ఈ వివాదం సంగతి పక్కన పెడితే... ప్రస్తుతం శింబు తన ఫ్యామిలీతో కలిసి థాయ్లాండ్లో హాలిడే ఎంజాయ్ చేస్తున్నారు. అయితే శింబు తండ్రి టి రాజేందర్ తమిళనాడులోనే ఉన్నారు. ఇటీవల ఆయన కాంచీపురంలోని అథివరధర్ ఆలయాన్ని సందర్శించారు.
ఈ సందర్భంగా టి రాజేందర్ మీడియా వారితో మాట్లాడుతూ... తన కుమారుడు ప్రస్తుతం విదేశాల్లో ఉన్నారని తెలిపారు. శింబు పెళ్లి త్వరగా జరుగాలని, అతడికి సూటయ్యే అమ్మాయి, అతడు మెచ్చే అమ్మాయి దొరరాలని ప్రార్థించినట్లు తెలిపారు. త్వరలోనే తన ప్రార్థనలు ఫలించాలని కోరుకుంటున్నట్లు తెలిపారు.
హాలిడే పూర్తి చేసుకుని శింబు ఇండియా తిరిగి వచ్చిన తర్వాత 'మానాడు' వివాదం ఎలాంటి మలుపు తిరుగుతుంది? అనేది తమిళ ఇండస్ట్రీలో చర్చనీయాంశం అయింది. ఈ విషయాన్ని తాను అంత ఈజీగా వదలనని ఆగ్రహంగా ఉన్నారట శింబు. ప్రస్తుతం శింబు 'మఫ్టి' అనే రీమేక్ చిత్రంలో నటిస్తున్నారు. ఈ చిత్రంలో గీతమ్ కార్తీక్ మరో ముఖ్యమైన పాత్రలో నటిస్తుండగా స్టూడియో గ్రీన్ వారు నిర్మిస్తున్నారు.