Don't Miss!
- Automobiles ఇలా చేయడం కరెక్టేనా? తప్పో.. ఒప్పో మీరే చెప్పాలి - వీడియో
- News తండ్రైన ముఖ్యమంత్రి: తొలి నేతగా రికార్డ్
- Technology 6.67 అంగుళాల డిస్ప్లే, ట్రిపుల్ కెమెరాతో వివో కొత్త ఫోన్... లాంచ్, స్పెసిఫికేషన్ల వివరాలు..!
- Sports IPL 2024: రెండుగా చీలిన ముంబై ఇండియన్స్.. హార్దిక్ మాట వినని రోహిత్ గ్రూప్!
- Lifestyle First Surya Grahan: ఏప్రిల్ నెలలో మొదటి సూర్య గ్రహణం ఎప్పుడు? సూతక కాలం
- Finance Stock Market: లాభాల్లో ముగిసిన సూచీలు.. మార్కెట్ ర్యాలీకి 5 కారణాలివే..
- Travel చారిత్రాత్మకమైన నగరమైన గ్వాలియర్లో సందర్శించాల్సిన ప్రదేశాలివే..!
రెట్రో లుక్ లో హీరోతో కలిసి తమన్నా (ఫొటో)
చెన్నై: ఈ క్రింద ఫొటోలో తమన్నా ని చూసిన వారు ఆశ్చర్యపోతున్నారు. పూర్తి స్ధాయి రెట్రో లుక్ తో ఆమె తన అభిమానులను ఆనందపరచటానికి సిద్దపడుతోంది. తమిళంలో తమన్నా ప్రస్తుతం చేస్తున్న 'Vasuvum Sivavum Onna Padichittanga' లోది ఈ స్టిల్. బాస్ ఎనగర భాస్కరన్(తెలుగులో నేనే అంబాని) దర్శకుడు రాజేష్ డైరక్ట్ చేస్తున్న చిత్రంలో ఆమె ఇలా కొన్ని కొన్ని సన్నివేశాల్లో కనిపించనుంది. ఈ సన్నివేశాలు ఫన్నీగా ఉండనున్నాయని తెలుస్తోంది. ఈ ఫొటోలో తమన్నా ని చూస్తుంటే మన పాత చిత్రాల్లోని హీరోయిన్స్ గుర్తు వస్తున్నారు కదూ.
ఫేస్బుక్ ద్వారా లేటెస్ట్ అప్డేట్స్ ఎప్పటికప్పుడు
పరాజయంతో కెరీర్ను ప్రారంభించినా, తొందర్లోనే తన తప్పుల్ని సరిదిద్దుకొనే స్టార్ హీరోయిన్స్ జాబితాలో చేరిపోయింది తమన్నా. తెలుగునాట స్టార్ హీరోలతో జతకట్టింది. తమిళ, హిందీసీమల్ని చుట్టొచ్చింది. ఇప్పుడు మరో రౌండ్ వేస్తోంది. తాజాగా ఆమె రవితేజ సరసన నటించనుందని సమాచారం. రచ్చ దర్శకుడు సంపత్ నంది దర్శకుడుగా రూపొందే చిత్రంలో ఆమెను తీసుకుంటున్నట్లు తెలుస్తోంది. రచ్చ లోనూ తమన్నానే హీరోయిన్ గా చేసిన సంగతి తెలిసిందే. ఇక రవితేజ కిక్ 2 పూర్తైన వెంటనే ఈ చిత్రం షూటింగ్ కి వస్తారు.
తమన్నా మాట్లాడుతూ ''ఏ విషయంలోనైనా సానుకూల దృక్పథంతో నడుచుకొంటా. నాకు స్నేహితులెక్కువ. అదే నా బలం. అన్ని వయసులవారితోనూ స్నేహం చేస్తా. నా స్నేహితుల్లో నాకంటే పెద్ద వయసున్నవాళ్లున్నారు. చిన్న పిల్లలూ ఉన్నారు. అన్ని వర్గాల అభిరుచుల్నీ తెలుసుకోవడానికి నాకిదో మార్గంగా కనిపించింది. నన్ను ఎవరు, ఎలా చూడాలనుకొంటున్నారనే విషయంలో నాకో నిశ్చితమైన అభిప్రాయం ఉంది. నా సినిమాల గురించి వాళ్లతో మాట్లాడతాను'' అంది.
అలాగే... ''ఏ విషయంలో తప్పు చేశాను? ఎక్కడ పొరపడ్డానో వాళ్లే చెప్పేస్తుంటారు. నా సినిమా విడుదలైందంటే గంటకో రివ్యూ ఇస్తుంటారు. వాళ్ల అభిప్రాయాలకు నేనూ విలువ ఇస్తా. నా దృష్టిలో నా స్నేహితులే ఉత్తమ విమర్శకులు'' అని చెప్పుకొచ్చింది తమన్నా. ప్రస్తుతం 'బాహుబలి'లో ప్రభాస్ సరసన నటిస్తోంది. 2015లో ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకురానుంది.