Don't Miss!
- Technology Samsung నుంచి 'Music Frame' స్పీకర్ లు లాంచ్! ప్రత్యేకతలేంటి. ధర వివరాలు
- News వల్లభనేని వంశీకి షాకిచ్చేలా యార్లగడ్డతో చంద్రబాబు వ్యూహం!!
- Sports భారత్.. టీ20 వరల్డ్ కప్ 2024 కొట్టాలంటే: లెజెండరీ ప్లేయర్ సలహా
- Finance Medicines News: కిరాణా కొట్టులో మందుల విక్రయం.. మోదీ సర్కార్ సంచలన నిర్ణయం..!!
- Lifestyle ప్రాణాలకు ముప్పు ఉందని తెలిపే హీట్ స్ట్రోక్ లక్షణాలు
- Travel ట్రైన్ జర్నీలో ఆరు రోజులపాటు సాగే తిరుపతి టు ఊటీ టూర్ ప్యాకేజీ..వివరాలివే..!
- Automobiles 25 దేశాల్లో రాయల్ ఎన్ఫీల్డ్ బైక్ రెంటల్స్ అండ్ టూర్స్ సర్వీస్.. RE ఫ్యాన్స్కు పండగే
ఆ దర్శకుడితో చేయాలని కోరిక ఉంది...తమన్నా
దర్శకుడు గౌతమ్ మీనన్ చిత్రంలో నటించాలని ఉంది. ఆయన హీరోయిన్లను అందంగా చూపించడమే కాదు అభినయానికి అవకాశం ఉంటుంది. అలాగే శంకర్, శశికుమార్ ఇలా చా లా మంది దర్శకులతో పనిచేయాలని కోరుకుంటున్నాను అంటోంది హ్యాపీ గర్ల్ తమన్నా. అలాగే తనకు ఏమి మాయ చేసావే చిత్రం బాగా నచ్చిందని, గౌతమ్ మీనన్ చిత్రాలు వదిలిపెట్టకుండా చూస్తానని చెప్పుకొచ్చింది. ఇక తనకూ, తమిళ హీరో కార్తీకి మధ్య ఎఫైర్ నడుస్తోందంటూ వస్తున్న వార్తలు గురించి మాట్లాడుతూ..రూమర్స్ ని పట్టించుకోవాల్సిన అవసరం లేదు. ఎందుకంటే అవి అవాస్తవాలే కనుక. అలాగే ఈ విషయంలో ఎవర్నీ నమ్మించాల్సిన అవసరం కూడా నాకు లేదు. నేనేమిటో నా తల్లిదండ్రులకు తెలుసు అంది. ప్రస్తతుం ఆమె ధనుష్ సరసన తమిళంలో వేంగై చిత్రంలో నటిస్తోంది. తెలుగులో జూనియ ర్ ఎన్జీఆర్ సరసన సురేంద్రరెడ్డి దర్శకత్వంలో చేయటానికి సైన్ చేసింది. అలాగే ..సుకుమార్, నాగచైతన్యతో కాంబినేషన్ లోనూ, అల్లు అర్జున్ సరసన బద్రీనాధ్ చిత్రంలోనూ చేస్తోంది. అలాగే ఆమె భరత్ సరసన నటించిన ఓ చిత్రం ప్రియ...ప్రియతమ టైటిల్ తెలుగులో డబ్బింగ్ అవుతోంది.