Don't Miss!
- Lifestyle నోరూరించే పచ్చి మామిడికాయ గొజ్జు మామిడికాయ కర్రీ వేడివేడి అన్నంతో తింటుంటే ఆహా అనాల్సిందే..
- News కేసీఆర్ కుటుంబం, మాజీమంత్రి ఎర్రబెల్లిపై మంత్రి కొండా సురేఖ సంచలన వ్యాఖ్యలు!!
- Finance Rain Tax: ఆ నగరంలో ప్రజలపై వర్షం టాక్స్..! ఏప్రిల్ నుంచి దబిడిదిబిడేనా..??
- Technology ఆపిల్ వరల్డ్ వైడ్ డెవలపర్ కాన్ఫరెన్స్ 2024 తేదీ వెల్లడి.. iOS 18, GenAI పై కీలక ప్రకటనలకు అవకాశం..!
- Automobiles బుల్లితెర నటి 'ప్రజ్ఞా భట్' కొత్త కారు చూసారా.. ధర ఎంతో తెలుసా?
- Sports Hardik Pandya: కెప్టెన్గా చెత్త రికార్డు సాధించా.. హ్యాపీనే!
- Travel శివ కళ్యాణోత్సవాలకు ముస్తాబైన వేములవాడ రాజన్న ఆలయం!
తమన్నానే హీరోయిన్ ...రేపటి నుంచే షూటింగ్
చెన్నై: తమిళ తెరపై మిల్కీ వైట్ బ్యూటీ తమన్నా మరోమారు తళుక్కుమని మెరవనున్నారంటూ తమిళ తంబిలు ఆనందపడుతున్నారు. గతంలో ఆర్యతో 'బాస్ ఎంగిరా భాస్కరన్' (నేనే అంబాని) వంటి హిట్ సినిమాలు తీసిన దర్శకుడు రాజేశ్.... మళ్లీ ఆర్య, సంతానం కాంబినేషన్లో మరో చిత్రాన్ని తెరకెక్కించే ప్రయత్నాల్లో ఉన్నారు. ఈ సినిమాలో ఆర్య సరసన అందాల తమన్నా జోడీ కడుతున్నారు. ఇందులో ఆమెది చాలా కీలక పాత్రని సమాచారం.
సోమవారం షూటింగ్ ప్రారంభించి ఈ నెల 21న చెన్నైలో రెగ్యులర్ షూటింగ్ నిర్వహించనున్నట్లు దర్శకుడు రాజేశ్ చెప్పారు. ఇది పూర్తి వినోదాత్మక చిత్రమని తెలిపారు. 'బాస్ ఎంగిరా భాస్కరన్'కు ఇది సీక్వెల్ అని వస్తున్న ప్రచారాన్ని ఆయన ఖండించారు. ఇది పూర్తి వైవిధ్య వినోదాత్మక చిత్రమన్నారు. దీంతో తమన్నా మళ్లీ తమిళ తెరపై జోరు పెంచనున్నారు.
తెలుగు లో తమన్నా...
రవితేజ సరసన తమన్నా ఆడిపాడబోతోంది. సంపత్ నంది దర్శకత్వంలో రవితేజ హీరోగా ఓ చిత్రం తెరకెక్కనున్న విషయం తెలిసిందే. అందులో హీరోయిన్ గా తమన్నా ఎంపికయ్యిందంటూ వార్తలు వచ్చాయి. అదే నిజమేనంటూ ఆ విషయాన్ని తమన్నా ట్వీట్ చేసి అఫీషియల్ గా తెలిపింది. సినిమాలో మరో హీరోయిన్ కూ చోటుంది.
తమన్నా ట్వీట్ చేస్తూ..."రచ్చ డైరక్టర్ సంపత్ నందితో మళ్లీ పనిచేయటం చాలా సంతోషంగా ఉంది.. అలాగే రవితేజ తో మొదటి సారి నటించటం చాలా ఎక్సైటింగ్ గా ఉంది. అందుకోసం ఎదురుచూస్తున్నా" అంది. ఇక సంపత్ నంది, రవితేజ దర్శకత్వంలో చిత్రం అని ప్రకటించగానే అంతా..కావాలని మీడియా ఇబ్బందులు ఎదుర్కోవటానికి ఇచ్చిన ప్రకటన అనుకున్నారు. కానీ తమన్నా ట్వీట్ తో ఆ ప్రాజెక్టు ఉన్నట్లే అని అర్దమవుతోంది.
మిగతా చిత్రాల విషయానికి వస్తే...
నాలుగేళ్లపాటు కోలీవుడ్లో హవా చాటిన మిల్కీ వైట్ బ్యూటీ.. తమన్నా ఆ మధ్య టాలీవుడ్పై దృష్టి పెట్టింది. ఎన్టీఆర్, మహేష్బాబు, అల్లు అర్జున్, రామ్చరణ్లతోపాటు పలువురు స్టార్ హీరోలందరితో జతకట్టింది. మళ్లీ ఇప్పుడు కోలీవుడ్కు రీఎంట్రీ ఇవ్వబోతోందని సమాచారం. అయితే అది స్ట్రైయిట్ గా కాదు...తెలుగు,తమిళ చిత్రంతో అనితెలుస్తోంది. ఆ హీరో మరెవరో కాదు కార్తి. ఈ చిత్రంలో నాగార్జున సైతం కనిపించనున్నారు. నాగార్జున, కార్తీ కాంబినేషన్ లో ఈ చిత్రం రూపొందుతోందని సమాచారం.
రీఎంట్రీలో ఏకంగా అజిత్తో జతకట్టి 'వీరం' వంటి బిగ్గెస్ట్ హిట్ను అందించింది. ప్రస్తుతం సూర్య, విజయ్లతో జతకట్టనున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఏళ్లు గడుస్తున్నా.. వన్నెతగ్గని సోయగంతో.. దక్షిణాదిలో మోస్టు వాంటెడ్ హీరోయిన్గా హవా చాటుకుంటోంది తమన్నా ఇప్పుడు ఊహించని విధంగా కార్తితో మరోసారి ఈ ప్రాజెక్టులోకి వచ్చిందని సమాచారం.
పూర్తి వివరాల్లోకి వెళితే....వంశీ పైడిపల్లి దర్శకత్వంలో నాగార్జున, తమిళ హీరో కార్తి కలసి మల్టీస్టారర్ సినిమాలో నటిస్తున్న సంగతి తెలిసిందే. తెలుగు, తమిళ భాషలలో ఏకకాలంలో ఈ సినిమా షూటింగ్ చేయనున్నారు. ఈ భారి బడ్జెట్ సినిమాను పివిపి సంస్థ నిర్మిస్తుంది. ఈ సినిమాలో హీరోయిన్ గా తమన్నాను సెలెక్ట్ చేశారనేది టాక్. ఈ సినిమాలో నాగార్జున, కార్తి ఒకే హీరోయిన్ తో రొమాన్స్ చేస్తారని సమాచారం. అయితే అధికారికంగా దర్శకనిర్మాతల నుండి ఎటువంటి ప్రకటన రాలేదు.
ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ వర్క్స్ జరుగుతున్నాయి. త్వరలో షూటింగ్ ప్రారంభమవుతుంది. ఇక గతంలో తెలుగులో నాగార్జున సరసన తమన్నా ఇప్పటివరకు నటించలేదు. ఒకవేళ ఈ వార్త నిజమైతే ఇదే తొలి సినిమా అవుతుందని నాగార్జున అభిమానులు ఆనందపడుతున్నారు.
మరో ప్రక్క కార్తి,తమన్నాలు తమిళంలో హిట్ పెయిర్ గా పేరు తెచ్చుకున్నారు. వీరిద్దరి కాంబినేషన్లో వచ్చిన ‘అవారా' , ‘సిరుత్తై' (విక్రమార్కుడు రీమేక్) సినిమాలు మంచి విజయాలు సాధించాయి. తమన్నా ని తీసుకోవటం వల్ల తమిళంలో కూడా సినిమాపై మంచి క్రేజ్ ఏర్పడుతుందని తీసుకున్నట్టు సమాచారం. పూర్తి వివరాలు త్వరలో వెల్లడయ్యే అవకాశం ఉంది.