మీడియాపై తీవ్రంగా మండిపడ్డ తమన్నా
తమన్నా తాజాగా మీడియాపై మండిపడుతూ మాట్లాడింది. తనపై వచ్చిన ఓ రూమర్ కి తీవ్రంగా స్పందించింది. ఆమెకు తమిళ సినిమాల్లో ఆఫర్స్ రావటం లేదని,అందుకే త్రిష హీరోయిన్ గా చేస్తున్న ఓ చిత్రంలో సెకండ్ హీరోయిన్ గా కమిటైందని రూమర్ వచ్చింది. అయితే తనకు ఆఫర్స్ రావటం లేదని ఎవరో కావాలని ప్రచారం చేస్తున్నారని,తనను ఏ తమిళ దర్శకుడు తమ సినిమా కోసం కన్సల్ట్ చేయలేదని,అలాంటప్పుడు ఫలానా సినిమాలో ఒప్పుకున్నాననటం అబద్దమని అంది.
అలాగే తను తమిళ సినిమాలు ఒప్పుకోకపోవటానికి పర్శనల్ కారణం ఉందని వివరించింది. అలాగే ఆ పర్శనల్ కారణం ఏంటని అడగొద్దని చెప్పింది. ఇక తను తమిళంలో చివరగా ధనుష్ తో చేసానని అంది. తెలుగు సినిమాల విషయమై చెప్తూ..ప్రస్తుతం మూడు సినిమాలు చేస్తూ బిజీగా ఉన్నానని అంది. అవి రామ్ చరణ్ తో రచ్చ, ప్రభాస్ తో రెబెల్,రామ్ తో ఎందుకంటే ప్రేమంట అనే చిత్రాలు అని చెప్పుకొచ్చింది. ఇక తెలుగులోనూ కొత్త చిత్రాలు ఒప్పుకోలేదని అంది. హిందీ నుంచి ఆఫర్స్ వస్తున్నా బిజీగా ఉండటంతో అటు వైపు అడుగులు వేయటం లేదని అంది.


Click it and Unblock the Notifications











