Don't Miss!
- News ద్రోణి ప్రభావం: ఏపీలోని ఈ జిల్లాలకు వర్ష సూచన; అన్నదాతల ఆందోళన!!
- Finance Stock Market: ఎన్నికల ముందు మార్కెట్లలో అలజడి.. కుప్పకూలిన సెన్సెక్స్-నిఫ్టీ..
- Sports ముంబయి ఇండియన్స్కు కొత్త బౌలర్ వచ్చాడు
- Automobiles కొత్తగా మారిన ప్రమాదానికి గురైన కారు - ఫిదా చేస్తున్న వీడియో!
- Lifestyle మీ బాయ్ఫ్రెండ్/గర్ల్ఫ్రెండ్లో ఈ మార్పులు ఉంటే మిమ్మల్ని చీట్ చేయడానికి పన్నాగం పడుతున్నారని అర్థం జాగ్రత్త
- Technology గూగుల్ క్రోమ్ భద్రత కోసం సరికొత్త ఫీచర్.. వెబ్సైట్లోకి వెళ్లగానే మాల్వేర్ అటాక్లపై అప్రమత్తం చేస్తుంది!
- Travel హోలీ సందర్భంగా దేశంలోని ఈ ప్రదేశాలను చుట్టేయండి..!
కరోనా కాటుకు మరో కమెడియన్ మృతి... రజనీ, అజిత్, విజయ్తో...
కరోనావైరస్ ధాటికి సినీ పరిశ్రమలో మరో విషాదం చోటుచేసుకొన్నది. తమిళ సినిమా పరిశ్రమలో అనేక విభిన్నమైన పాత్రలతో ఆకట్టుకొన్న నటుడు, కమెడియన్ పాండు ఇకలేరు. కరోనావైరస్ బారిన పడిన ఆయన చికిత్స పొందుతూ ఓ ప్రైవేట్ హాస్పిటల్లో మరణించారు. హాస్పిటల్ నుంచి నేరుగా శ్మశాన వాటికకు ఆయన పార్ధీవ దేహాన్ని తీసుకెళ్లి అంత్యక్రియలు నిర్వహించేందుకు నిర్ణయం తీసుకొన్నారు. ఆయన అంత్యక్రియలు బీసెంట్ నగర్ శ్మశాన వాటికలో జరుగనున్నాయి.
సాక్షి అగర్వాల్.. అమ్మాయి నడుమంటే ఇలా ఉండాలి
కొద్ది రోజుల క్రితం పాండు, ఆయన భార్య కుముదాకు కోవిడ్ 19 పాజిటివ్ అని నిర్ధారణ అయింది. దాంతో చెన్నైలోని ప్రైవేట్ హాస్పిటల్లో చేర్పించారు. చికిత్స పొందుతూ గురువారం ఉదయం కన్నుమూశారు. ఆయన భార్య ఇంకా ఐసీయూలోనే చికిత్స పొందుతున్నారు అని సన్నిహితులు తెలిపారు. పాండు మృతి వార్తను నటుడు మనోబాలా సోషల్ మీడియా ద్వారా వెల్లడించారు.
పాండు వయసు 71 సంవత్సరాలు. ఆయనకు ప్రభు, పంచు, పింటూ అనే ముగ్గురు కుమారులు ఉన్నారు. నటుడిగా పాండు పలు విభిన్నమైన పాత్రలను పోషించారు. రజనీకాంత్, విజయ్, అజిత్ లాంటి సూపర్స్టార్స్తో నటించారు. అజిత్ నటించిన కాదల్ కొట్టై చిత్రంలో పాండు పోషించిన పాత్రకు విశేష ఆదరణ దక్కింది. విజయ్ నటించిన గిల్లీ లాంటి చిత్రాల్లో నటించారు.
నటనతోపాటు క్యాపిటల్ లెటర్స్ అనే వ్యాపార సంస్థను నిర్వహిస్తున్నారు. ఈ సంస్థ ద్వారా సినీ తారల ఇండ్లకు, ఆఫీసులకు డిజైనింగ్ నేమ్ బోర్డ్స్ చేస్తూ వ్యాపారం చేశారు. అంతేకాకుండా అన్నాడిఎంకే పార్టీ గుర్తు రెండాకులు డిజైన్ చేసింది పాండు కావడం విశేషం.