Don't Miss!
- News కాంగ్రెస్ సర్కారును టచ్ చేస్తే..: బీజేపీ, బీఆర్ఎస్లకు సీఎం రేవంత్ హెచ్చరిక
- Sports LSG vs CSK: ధోనీ పవర్ హిట్టింగ్.. మెరిసిన జడేజా
- Automobiles వెస్పా 140 వ యానివర్సరీ వేడుకలు.. స్పెషల్ ఎడిషన్ స్కూటర్ లాంచ్..
- Lifestyle వేసవిలో కిడ్నీలు భద్రంగా ఉండాలంటే రోజూ ఎన్ని గ్లాసుల నీళ్లు తాగాలో తెలుసా?
- Technology రియల్మి ప్యాడ్ 2 వైఫై వేరియంట్ సేల్ ప్రారంభం.. రూ.2000 తగ్గింపు.. ఆఫర్ కొన్నిరోజులు మాత్రమే..!!
- Travel తెలంగాణలోని గొంతెమ్మగుట్ట సందర్శనకు బయలుదేరుదామా..?
- Finance Market Closing: మార్కెట్లను వీడిన నిరాశ మేఘాలు.. లాభాల్లో ముగిసిన సెన్సెక్స్-నిఫ్టీ..
షాకింగ్: యువ నటుడు కన్నుమూత.. శోకసంద్రంలో సినీ ప్రముఖులు
వర్ధమాన నటుడు, చర్మవ్యాధి నిపుణుడు సేతురామన్ ఇకలేరు. గురువారం రాత్రి గుండెపోటుతో తుదిశ్వాస వదిలారు. రాత్రి 8.45 గంటల ప్రాంతంలో గుండెపోటు రావడంతో హాస్పిట్కు తరలించామని, అప్పటికే ఆయన మృతి చెందారని వైద్యులు తెలిపారని కుటుంబ సభ్యులు వెల్లడించారు. సేతురామన్ మృతివార్తతో కోలీవుడ్ ప్రముఖులు విషాదంలో మునిగిపోయారు. వివరాల్లోకి వెళితే..
స్కిన్ స్పెషలిస్ట్
సేతురామన్ వృత్తిరీత్యా చర్మవ్యాధి నిపుణులు. డాక్టర్గా సేవలందిస్తూనే నటుడిగా పలు చిత్రాల్లో నటించి మెప్పించారు. ఆయన వయసు 36 సంవత్సరాలు. ఆయనకు భార్య ఉమాయల్, ఏడాది వయసున్న కూతురు ఉన్నారు. సేతురామన్ ఆకస్మిక మృతితో కుటుంబ సభ్యులు శోక సంద్రంలో మునిగిపోయారు.
2013లో కోలీవుడ్లోకి
ప్రముఖ నటుడు సంతానంకు సేతురామన్ స్నేహితుడు. 2013లో మణికందన్ దర్శకత్వంలో వచ్చిన కన్న లడ్డు తిన్న అసైయా అనే చిత్రం ద్వారా తమిళ చిత్ర పరిశ్రమకు పరిచయం అయ్యారు. ఈ చిత్రంలో సంతానం, సేతు, పవర్స్టార్ శ్రీనివాసన్, విశాఖ సింగ్ కీలక పాత్రలు పోషించారు. ఆ తర్వాత వల్లభ రాజా, సక్కపోడు.. పోడు రాజా, 50/50 చిత్రాల్లో నటించారు.
తమిళ ప్రముఖుల సంతాపం
సేతరామన్ మృతితో తమిళ చలన చిత్ర పరిశ్రమకు చెందిన ప్రముఖులు కుష్బూ, వెంకట్ ప్రభు, నిర్మాత ధనుంజయన్, వివేక్, అతుల్య రవి, లోకేశ్ కనకరాజ్ తదితరులు స్పందించారు. సోషల్ మీడియా ద్వారా తమ సంతాపాన్ని తెలియజేశారు.
Recommended Video
ఎప్పుడూ చిరునవ్వుతో..
డాక్టర్ సేతురామన్ ఇకలేరనే విషాదవార్తతో తీవ్ర దిగ్భ్రాంతికి లోనయ్యాను. అత్యంత ప్రతిభావంతుడైన నటుడు, డాక్టర్ చిన్నతనంలోనే ప్రాణాలు కోల్పోవడం బాధాకరం. మెరిసే కళ్లతో పెదవిపై చిరునవ్వుతో ఎప్పుడూ కనిపించేవారు. అద్బుతమైన వ్యక్తి. నీవెప్పుడూ మా మనసు, ఆలోచనల్లో ఉంటావు. నీ ఆత్మ శాంతి కలుగాలి. నీ కుటుంబానికి మనోధైర్యాన్ని ఇవ్వాలని భగవంతుడిని కోరుతున్నాను అని కుష్బూ ట్వీట్ చేశారు.