Don't Miss!
- Sports IPL 2024: ముంబై ఇండియన్స్కు బిగ్ షాక్.. విధ్వంసకర బ్యాటర్ దూరం!
- News Chengicherla: రాజా సింగ్ హౌస్ అరెస్ట్, బండి సంజయ్పై కేసు నమోదు
- Lifestyle ఎన్నికల ముందు ప్రచారంలో గాల్లో మేడలు కడుతున్న నాయకులు..
- Technology రియల్మి కొత్త ఫోన్ టీజర్ విడుదల.. సెగ్మెంట్లోనే సన్నని డిజైన్ సహా కీలక ఫీచర్లు..!
- Automobiles 6 కోట్ల కస్టమర్లతో భారత్లో హోండా తిరుగులేని రికార్డు.. ఎక్కువగా వీటిపైనే క్రేజ్.!!
- Finance Stock Market: లాభాల్లో ముగిసిన సూచీలు.. మార్కెట్ ర్యాలీకి 5 కారణాలివే..
- Travel చారిత్రాత్మకమైన నగరమైన గ్వాలియర్లో సందర్శించాల్సిన ప్రదేశాలివే..!
సీనియర్ జర్నలిస్టు లైంగికంగా వేధిస్తున్నాడు: తమిళ నటి ఫిర్యాదు
తమిళ నటి గాయిత్రి సాయి(42) సీనియర్ జర్నలిస్టు మీద లైంగిక వేధింపుల ఆరోపణలు చేయడం చర్చనీయాంశం అయింది. తనకు లొంగకుంటే నిన్ను అప్రతిష్టపాలు చేస్తానంటూ జర్నలిస్ట్ ప్రకాష్ ఎం స్వామి తనను వేధిస్తున్నాడని ఆమె పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు తన సోషల్ మీడియా పేజీలో ఈ విషయాన్ని వెల్లడిస్తూ ఓ వీడియో కూడా ఆమె పోస్టు చేశారు.
గత రెండేళ్లుగా ఇతడు తనను వేధింపులకు గురి చేస్తున్నాడని, పోలీస్ కమీషనర్ను కలిసి తాను ఈ విషయమై ఫిర్యాదు చేసినట్లు తెలిపారు. వాట్సాఫ్ ద్వారా అసభ్యకరమైన సందేశాలు పంపేవాడని, తన కుమారుడిని పాస్పోర్ట్ విషయంలో హెల్ప్ చేస్తాననే నెపంతో మా ఇంటికి వచ్చి ఫిజికల్గా వేధించేవాడని సదరు నటి తన ఫిర్యాదులో పేర్కొన్నారు.
2016లో హాంకాంగ్లో తన భర్త హార్ట్ ఎటాక్తో చనిపోయిన తర్వాత తొలిసారి స్వామి తనను కలిశాడని నటి పేర్కొంది. నా భర్తను నేనే చంపినట్లు తప్పుడు వార్తలు ప్రచారం చేస్తున్నాడని, కొన్ని లోకల్ మేగజైన్లో చీప్, బేస్ లెస్ స్టోరీస్ కూడా తనపై రాశాడని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు.
తననే కాకుండా తన కూతురును కూడా డీఫేమ్ చేసే ప్రయత్నం చేస్తున్నాడని నటి గాయిత్రి సాయి ఆరోపించారు. చాలా మంది మహిళలను అతడు వేధించాడని, తనకు రాజకీయ నాయకులతో పరిచయాలు ఉన్నాయని చెప్పి బెదిరింపులకు పాల్పడుతుంటాడని ఆరోపించారు.
అయితే తనపై చేస్తున్న ఆరోపణలను జర్నలిస్ట్ స్వామి ఖండించారు. నేను ఆమె ఇంటిని ఎప్పుడూ సందర్శించలేదని, సెక్సువల్ వేధింపులకు పాల్పడ్డట్లు ఆమె చేస్తున్న ఆరోపణల్లో నిజం లేదన్నారు. రెండేళ్లుగా వేధింపులకు గురి చేస్తున్నట్లు చెబుతున్న ఆమె... ఇంతకాలం ఎందుకు ఆగిందని ప్రశ్నించారు. పాస్ పోర్ట్ విషయంలో హెల్ప్ చేసిన మాట నిజమే అన్నారు. ఆమెకు వ్యతిరేకంగా తాను ఓ స్టోరీని సిద్దం చేస్తున్నానని, అది తెలిసి నాపై ఇలాంటి లేని పోని ఆరోపణలు చేస్తోందిన జర్నలిస్టు స్వామి అన్నారు.