Don't Miss!
- News Lok Sabha Election 2024: నేడే తొలి దశ పోలింగ్, 102 స్థానాల్లో ఎన్నికలకు సర్వం సిద్ధం
- Sports PBKS vs MI: అతను అసాధారణ బ్యాటింగ్తో భయపెట్టాడు: హార్దిక్ పాండ్యా
- Lifestyle గుడ్నైట్ సందేశాలను ఇలా సరదాగా పంపుకోండి..
- Technology 40 గంటలకు పైగా బ్యాటరీ బ్యాకప్, ChatGPT వాయిస్ AI సపోర్టుతో నథింగ్ ఇయర్బడ్స్ విడుదల.. సేల్ వివరాలు!
- Automobiles గొప్ప మనసు చాటుకున్న రాఘవ లారెన్స్.. దివ్యాంగులకు టీవీఎస్ స్కూటర్ల పంపిణీ
- Finance Market Closing: నష్టాల్లోకి జారుకున్న సెన్సెక్స్-నిఫ్టీ.. ఆ రెండిటిపైనే అందరి కన్ను..
- Travel ఒంటిమిట్ట శ్రీ కోదండరామస్వామి ఆలయంలో టీటీడీ అన్నప్రసాదం ప్రారంభం..
శ్రీరెడ్డి ఆరోపణలు.. ఇంతటితో ఫుల్ స్టాప్ పెట్టాలంటున్న తమిళ దర్శకుడు!
సంచలన నటి శ్రీరెడ్డి ఆరోపణల పర్వం టాలీవుడ్ నుంచి కోలీవుడ్ కు మారింది. శ్రీరెడ్డి ప్రస్తుతం తమిళ సినీ ప్రముఖులపై విమర్శలు గుప్పిస్తోంది. ఈ ఆరోపణల ఎకడవరకు వెళతాయో అర్థం కానీ పరిస్థితి నెలకొనివుంది. మురుగదాస్, లారెన్స్, శ్రీకాంత్ పై శ్రీరెడ్డి సంచలన ఆరోపణలు చేస్తున్న సంగతి తెలిసిందే.
శ్రీరెడ్డి ఆరోపణపై ప్రముఖ దర్శకుడు టి రాజేందర్ స్పందించారు. శ్రీరెడ్డి నుంచి ఆరోపణలు ఎదుర్కొన వారంతా సమాధానం చెప్పాల్సిన అవసరం ఉందని అన్నారు. చిత్ర పరిశ్రమలో ఇలాంటి వివాదాలు ఎక్కువకాడం మంచిది కాదని అన్నారు. ఇప్పటికైనా ఆరోపణలు ఎదుర్కొన్న వారంతా సమాధానం చెప్పి ఈ వివాదానికి ముగింపు పలకాలని కోరారు.
చిత్ర పరిశ్రమలో కాస్టింగ్ కౌచ్ అనేది సహజమైన విషయమే అని అన్నారు. కానీ తాను నటించిన చిత్రాల్లో, దర్శకత్వం వహించిన చిత్రాల్లో ఏ అమ్మాయిని కూడా కనీసం ముట్టుకోలేదని పేర్కొన్నారు.