Don't Miss!
- News ముగిసిన నామినేషన్ల పర్వం: బండి సంజయ్ సహా చివరి రోజు నామినేషన్లు వేసింది వీరే
- Sports SRH vs RCB: హమ్మయ్యా.. ప్రశాంతంగా పడుకుంటాం! ఆ గ్రౌండ్తోనే మాకు ఇబ్బంది: ఫాఫ్ డుప్లెసిస్
- Lifestyle ఈ 4 రాశుల వారు ఎల్లప్పుడూ ఇతరులకు రహస్య శ్రేయోభిలాషులు..
- Technology OnePlus Watch 2 వన్ప్లస్ వాచ్ 2 కొత్త వేరియంట్ విడుదల.. ధర, సేల్ పూర్తి వివరాలు..!
- Finance Jio Cinema Premium: నెలకు 29లతో జియో ప్రీమియం..
- Automobiles వందేభారత్ రైళ్లలో 1 లీటర్ వాటర్ బాటిల్ రద్దు.. రైల్వే శాఖ కీలక నిర్ణయం
- Travel కేవలం రూ. 5వేలతో హిమాచల్ప్రదేశ్లోని ఈ ప్రాంతాలను చుట్టేయొచ్చు..!
చిన్నవయస్సులోనే...: ప్రముఖ సినీ ఎడిటర్ మృతి
చెన్నై : ప్రముఖ చలనచిత్ర ఎడిటర్, జాతీయ పురస్కార గ్రహీత కిశోర్ జీవన్మృతి (బ్రెయిన్డెడ్) చెందారు. ఆయన వయసు 36 ఏళ్లు. 'పరదేశి', 'ఈరం', 'నెడుంజాలై', 'ఎదిర్నీచ్చల్'.. వంటి 30కి పైచిలుకు చిత్రాలకు ఎడిటర్గా వ్యవహరించారు. తెలుగులో 'ఉలవచారు బిర్యానీ', 'గగనం' చిత్రాలకు పనిచేశారు. కన్నడలో 'ఒక్కరానే' సినిమాకు కూడా ఎడిటింగ్ సేవలందించారు.
ఫేస్బుక్ ద్వారా లేటెస్ట్ అప్డేట్స్ ఎప్పటికప్పుడు
పిన్నవయసులోనే ఉత్తమ జాతీయ స్థాయి పురస్కారాన్ని 'ఆడుగలం' చిత్రానికి అందుకున్నారు. ఇదిలా ఉండగా గత కొంత కాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయనను ఇటీవల చెన్నైలోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చేరారు. పరీక్షించిన వైద్యులు కిశోర్ మెదడులో రక్తం గడ్డ కట్టినట్టు గుర్తించారు. శుక్రవారం సాయంత్రం ఆయన జీవన్మృతి చెందినట్లు వెల్లడించారు. కిశోర్ అవయవదానానికి వారి కుటుంబీకులు అంగీకరించారు. శనివారం ఉదయం అవయవాలు దానం చేయనున్నారు.
ఆయన ఇకలేరనే వార్తతో పరిశ్రమలో విషాద చాయలు అలుముకున్నాయి. కిషోర్.. దర్శకుడు వెట్టిమారన్ సినిమా ఎడిటింగ్ పనిలో ఉండగా అకస్మాత్తుగా కుప్పకూలిపోయారు . హాస్పిటల్కు తరలించగా, మెదడులో రక్తం గడ్డ కట్టి మరణించినట్టు ఆసుపత్రి వర్గాలు తెలిపాయి. తమిళంలో ఆయన ఎడిటర్గా పనిచేసిన ‘ఆడుకాలం' సినిమాకు గానూ ఆయనను జాతీయ అవార్డు వరించింది. ఆడుకాలం సినిమా.. పందెం కోళ్ళు పేరుతో జనవరి 30న తెలుగులో విడుదలై మంచి పేరు తెచ్చుకుంది.
తెలుగు, తమిళ భాషల్లో ఏకకాలంలో నిర్మింపబడిన సినిమాలు గగనం, ఉలవచారు బిర్యాని వంటి సినిమాలు ఆయనకు తెలుగులోనూ మంచి పేరు తెచ్చిపెట్టాయి. కిషోర్ మృతి పట్ల అటు తెలుగు, తమిళ పరిశ్రమ వర్గాలు దిగ్భ్రాంతిని వ్యక్తం చేశాయి. ప్రతిభా శాలి, యువకుడైన కిషోర్ ఇలా అర్థాంతరంగా చలించడంపై పలువురు సినీ ప్రముఖులు సంతాపం వ్యక్తం చేశారు. ఆయన ఆత్మకు శాంతి కలగాలని వన్ ఇండియా తెలుగు కోరుకుంటోంది.