Don't Miss!
- News TTD: శ్రీవారి దర్శనం , సేవలు, వసతి గదుల కోటా విడుదల...!!
- Sports వరల్డ్ కప్కు దూబె ఎంపికైనట్లే.. కానీ ఓ సమస్య- డివిలియర్స్
- Lifestyle 56 ఏళ్లుగా ఎవరికీ కనిపించకుండా ఇంట్లోనే దాక్కున్న ఓ రహస్య వ్యక్తి... ఆడవాళ్లంటే వింత భయం..!
- Automobiles త్వరలో మేడ్ ఇన్ ఇండియా బుల్లెట్ ట్రైన్స్.. ఇక ప్రపంచ దేశాలన్నీ భారత్ వైపు చూడాల్సిందే.!!
- Travel సిక్కింలోని యుమ్తంగ్ వ్యాలీ వేసవిలో సందర్శనకు ఉత్తమం..
- Technology iPhone 16 Pro కెమెరా ఫీచర్లు లీక్! కొత్తగా Anti-Reflective టెక్నాలజీ రానుంది
- Finance ఆ కంపెనీ కొనే రేసులో టాటాలు, అంబానీ, రాధాకిషన్ దమానీ..!! పూర్తి వివరాలు..
80 కోట్ల విగ్రహాల స్మగ్లింగ్ కేసు: ప్రముఖ సినీ నిర్మాత అరెస్టు
చెన్నై : విగ్రహాల స్మగ్లింగ్ వ్యవహారంలో ప్రముఖ తమిళ సినీ నిర్మాత వి.శేఖర్ను అరెస్టు చేశారు. పోలీసుల కథనం ప్రకారం... కేకే నగర్లోని శేఖర్ ఇంటిలో ఎనిమిది పంచలోహ విగ్రహాలను ఆయన భద్రపరచుకున్నాడు. వాటి విలువ రూ. 80 కోట్లు. చోరీకి సంబంధించి కొందరికి ఆశ్రయం కల్పించారు.
ఫేస్బుక్ ద్వారా లేటెస్ట్ అప్డేట్స్ ఎప్పటికప్పుడు
విగ్రహాల విభాగానికి చెందిన అడిషనల్ డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ ప్రదీప్ వి.ఫిలిప్ ఆధ్వర్యంలోని ప్రత్యేక బృందం ఆయన్ను అరెస్టు చేసింది. పదకొండు మంది సభ్యులతో పాటు కళాశాల విద్యార్థికి కూడా దీంతో సంబంధముంది. మేలో వెస్ట్మాంబళంలో జరిపిన తనిఖీలో ఆటోలో గోనెసంచులతో అనుమానంతో ప్రయాణిస్తున్న సినిమా ప్రొడక్షన్ మేనేజర్ ధనలింగాన్ని అరెస్టు చేశారు.
అప్పుడు పంచలోహ విగ్రహాలు లభ్యమయ్యాయి. వి.శేఖర్ తమిళంలో ప్రముఖ నిర్మాత. 'తిరువళ్లువర్ కలైకూడం' అనే నిర్మాణ సంస్థ నడుపుతున్నారు. గత జనవరి ఆరో తేదీన శ్రీపెరుంబుదూరులోని మణికంఠేశ్వర ఆలయం నుంచి 20 కిలోల శివపార్వతుల పంచలోహ విగ్రహాలు, నాలుగు రోజుల అనంతరం పయ్యూరు, కాంచీపురంలలోని నాలుగు దేవాలయాల నుంచి ఏడు పంచలోహ విగ్రహాలు చోరీకి గురయ్యాయి.
అనంతరం వాటిని వెస్ట్మాంబళంలో జరిపిన సోదాలో ధనలింగం నుంచి స్వాధీనం చేసుకున్నారు. అతడి ఇద్దరు అనుచరులను కూడా అరెస్టు చేశారు. శేఖర్ను ఎగ్మూరులోని మేజిస్ట్రేట్ కోర్టులో హాజరు పరిచిన అనంతరం పుళల్ జైలుకు తరలించారు.