Don't Miss!
- News Modi-Hanuman Chalia:హనుమాన్ ఛాలీసాపై ప్రధాని మోదీ వివాదాస్పద వ్యాఖ్యలు..!
- Finance Banking News: ప్రభుత్వ బ్యాంకులకు ఆ అధికారం లేదు.. బాంబే హైకోర్టు సంచలన తీర్పు..
- Automobiles వందేళ్ల వయసులో తాత జోరు.. 50 ఏళ్ల ప్రీమియర్ పద్మినిలో షికారు.. వీడియో చూసేయండి
- Sports IPL: నైట్ అంతా సిట్టింగ్ వేస్తే ఎలా గెలుస్తారు?- రైనా
- Technology అద్భుతమైన డిజైన్ తో నోకియా కొత్త ఫోన్ Nokia N90 Flip ! వివరాలు
- Lifestyle నిద్రపోకపోతే వచ్చే సమస్యలివే.. తీవ్రంగా హెచ్చరిస్తున్న పరిశోధకులు..!
- Travel ఫ్యామిలీ ట్రిప్ ప్లాన్ చేస్తున్నారా? అయితే, తెలంగాణలోని ఈ ప్రాంతం బెస్ట్..!
ఛీటింగ్ కేసులో సినీ నిర్మాత అరెస్టు
చెన్నై: భాగస్వామ్యం ఆశ చూపించి రూ.48 లక్షల మేరకు మోసం చేసిన కేసులో సినీ నిర్మాతను నగర పోలీసులు అరెస్టు చేశారు. పుదుకోట్త్టె జిల్లా కె.పుదుపట్టి గ్రామానికి చెందిన సెంథిల్బాబు (31) ఇటీవల చెన్నై నెర్కుండ్రానికి చెందిన సినీ నిర్మాత గణేశన్పై నగర పోలీసు కమిషనరు కార్యాలయంలో ఓ ఫిర్యాదు చేశారు.
ఫేస్బుక్ ద్వారా లేటెస్ట్ అప్డేట్స్ ఎప్పటికప్పుడు
'విసయం వెళియ తెరియకూడాదు నాసుక్కా చెయ్యనుం' అనే సినిమాను ప్రముఖ దర్శకుడు, మరికొంత మంది సహకారంతో నిర్మిస్తుండగా ఆర్థిక ఇబ్బందులతో నిలిచిపోయిందని, పెట్టుబడి పెడితే లాభాల్లో 47 శాతం ఇస్తానని గణేశన్ తనను నమ్మించాడని తెలిపారు.
దీంతో రూ.48 లక్షలు ఇవ్వగా... సినిమా విడుదలైన తర్వాత తిరిగి చెల్లించకపోవడంతోపాటు లాభం కూడా ఇవ్వలేదని పేర్కొన్నారు. నగర పోలీసు కమిషనరు రాజేంద్రన్ ఆదేశాల మేరకు దర్యాప్తు చేపట్టిన ప్రత్యేక బృందం గణేశన్ను మంగళవారం అరెస్టు చేసింది. కోర్టు ఆదేశాల మేరకు ఆయన్ను పుళల్ జైలుకు తరలించారు.