Don't Miss!
- Sports క్లాసెన్కు కావ్య మారన్ స్పెషల్ గిఫ్ట్!
- News Atchannaidu: అచ్చెన్నాయుడికి ఎన్నికల వేళ హైకోర్టులో భారీ ఊరట..!
- Finance Ambani-Adani: చేతులు కలిపిన అంబానీ-అదానీ.. 20 ఏళ్లకు అగ్రిమెంట్.. ఆ స్టాక్ దూకుడు..
- Automobiles హ్యుందాయ్ కస్టమర్లకు అదిరిపోయే న్యూస్.. వేసవిలో ప్రత్యేకంగా సర్వీస్ క్యాంప్.. ఎప్పటివరకు అంటే.??
- Travel చారిత్రాత్మకమైన నగరమైన గ్వాలియర్లో సందర్శించాల్సిన ప్రదేశాలివే..!
- Lifestyle నోరూరించే పచ్చి మామిడికాయ గొజ్జు మామిడికాయ కర్రీ వేడివేడి అన్నంతో తింటుంటే ఆహా అనాల్సిందే..
- Technology ఆపిల్ వరల్డ్ వైడ్ డెవలపర్ కాన్ఫరెన్స్ 2024 తేదీ వెల్లడి.. iOS 18, GenAI పై కీలక ప్రకటనలకు అవకాశం..!
ఛీటింగ్ కేసులో సినీ నిర్మాత అరెస్టు
చెన్నై: భాగస్వామ్యం ఆశ చూపించి రూ.48 లక్షల మేరకు మోసం చేసిన కేసులో సినీ నిర్మాతను నగర పోలీసులు అరెస్టు చేశారు. పుదుకోట్త్టె జిల్లా కె.పుదుపట్టి గ్రామానికి చెందిన సెంథిల్బాబు (31) ఇటీవల చెన్నై నెర్కుండ్రానికి చెందిన సినీ నిర్మాత గణేశన్పై నగర పోలీసు కమిషనరు కార్యాలయంలో ఓ ఫిర్యాదు చేశారు.
ఫేస్బుక్ ద్వారా లేటెస్ట్ అప్డేట్స్ ఎప్పటికప్పుడు
'విసయం వెళియ తెరియకూడాదు నాసుక్కా చెయ్యనుం' అనే సినిమాను ప్రముఖ దర్శకుడు, మరికొంత మంది సహకారంతో నిర్మిస్తుండగా ఆర్థిక ఇబ్బందులతో నిలిచిపోయిందని, పెట్టుబడి పెడితే లాభాల్లో 47 శాతం ఇస్తానని గణేశన్ తనను నమ్మించాడని తెలిపారు.
దీంతో రూ.48 లక్షలు ఇవ్వగా... సినిమా విడుదలైన తర్వాత తిరిగి చెల్లించకపోవడంతోపాటు లాభం కూడా ఇవ్వలేదని పేర్కొన్నారు. నగర పోలీసు కమిషనరు రాజేంద్రన్ ఆదేశాల మేరకు దర్యాప్తు చేపట్టిన ప్రత్యేక బృందం గణేశన్ను మంగళవారం అరెస్టు చేసింది. కోర్టు ఆదేశాల మేరకు ఆయన్ను పుళల్ జైలుకు తరలించారు.