Don't Miss!
- Sports RCB vs KKR: విరాట్ కోహ్లీ ట్రేడ్ మార్క్ సిక్సర్.. బిత్తరపోయిన మిచెల్ స్టార్క్! వీడియో
- News జైల్లో చిప్పకూడే.: కేటీఆర్కు సీఎం రేవంత్ రెడ్డి స్ట్రాంగ్ కౌంటర్
- Automobiles గిఫ్ట్ అంటే అబ్బాయిలే ఇవ్వాలా.??.. పెళ్లిలో వరుడికి వధువు అదిరిపోయే బైక్ గిఫ్ట్.. వైరల్ వీడియో చూసేయండి
- Technology 32MP+32MP సెల్ఫీ కెమెరాలతో షియోమీ కొత్త స్మార్ట్ఫోన్.. స్పెసిఫికేషన్లు, ఫీచర్ల వివరాలు..!
- Lifestyle Human Brain Size రోజు రోజుకు పెరుగుతున్న మానవ మెదడు సైజు, రాబోవు కాలంలో బహుషా ఈ వ్యాధులు ఉండవకపోవచ్చు..
- Finance Shapoorji Pallonji IPO: షాపూర్జీ పల్లోంజీ గ్రూప్ నుంచి భారీ ఐపీఓ..
- Travel నహర్ఘర్ కోట దెయ్యాల కోటగా ఎందుకు మారింది? ఈ స్టోరీ తెలిస్తే ఆశ్చర్యపోతారు!
వడివేలు మెడకు బిగుస్తున్న ఉచ్చు.. కఠిన చర్యలు తప్పవా?
Recommended Video
హింసించే రాజు 24వ పులకేసి చిత్ర వివాదం మరోసారి తెరపైకి వచ్చింది. తాను రూపొందించే సినిమా ఆలస్యం కావడం వల్ల తాను ఎంతో నష్టపోయానని తమిళ నిర్మాతల సంఘానికి ప్రముఖ నిర్మాత శంకర్ ఫిర్యాదు చేసిన సంగతి తెలిసిందే. ఆ నేపథ్యంలో హింసించే రాజు 24వ పులకేసి చిత్రం షూటింగ్కు వెంటనే హాజరుకావాలని నిర్మాతల మండలి షరతు విధించింది. అలాగే బేషరతుగా షూటింగ్కు హాజరుకావాలని, అలాగే స్క్రిప్టులో జోక్యం చేసుకోకూడదని ఆదేశించింది.
హింసించే 24వ రాజు పులకేసి
హింసించే రాజు 24వ పులకేసి చిత్ర వివాదాన్ని పరిష్కరించుకొనేందుకు తాజాగా తమిళ నిర్మాతల మండలిని వడివేలు కలిశారు. అయితే మండలితో వడివేలు భేటి ఎలాంటి ఫలితాన్ని ఇవ్వలేదని సమాచారం.
రూ.1 కోటి రెమ్యునరేషన్
అంతేకాకుండా చిత్రానికి ఇవ్వాల్సిన కోటి రూపాయల రెమ్యునరేషన్ను నిర్మాత చెల్లించే విధంగా చర్యలు తీసుకోవాలని వడివేలు సూచించడంపై నిర్మాత మండలి అభ్యంతరం వ్యక్తం చేసినట్టు సమాచారం. ఈ నేపథ్యంలో వడివేలుకు మండలి అల్టిమేటం జారీ చేసినట్టు తెలిసింది.
వడివేలుకు రూ.9 కోట్లు
హింసించే రాజు 24వ పులకేసి చిత్ర షూటింగ్ ఆగిపోయినందున నిర్మాత శంకర్ తీవ్ర నష్టాలకు గురయ్యారు. అతడికి కలిగిన నష్టాన్ని పూడ్చేందుకు వడివేలుకు రూ.9 కోట్లు చెల్లించాలని వడివేలును ఆదేశించినట్టు తెలిసింది. ఒకవేళ వడివేలు స్పందించకపోతే తీవ్రమైన చర్యలు తీసుకోవడానికి మండలి సిద్ధమవుతున్నట్టు సమాచారం.
సోలో హీరోగా వడివేలు
కమెడియన్గా రాణిస్తున్న తరుణంలో హింసించే రాజు 23వ పులకేసి చిత్రంలో వడివేలుకు హీరోగా శంకర్ అవకాశం ఇచ్చారు. ఆ చిత్రానికి శింబుదేవన్ దర్శకత్వం వహించారు. ఆ చిత్రం తర్వాత వడివేలు సోలో హీరోగా కొన్ని చిత్రాలు చేశారు. దానికి సీక్వెలుగా వస్తున్న 24వ పులకేసిలో మళ్లీ హీరోగా నటించే అవకాశం ఇవ్వగా అది వివాదంగా మారింది.