Don't Miss!
- News రుణమాఫీపై రైతులకు గుడ్ న్యూస్.. ఒక్కొక్కరికి రూ.2 లక్షలు
- Lifestyle Happy Birthday Wishes In Telugu : పుట్టినరోజు శుభాకాంక్షలను ఇలా అందంగా తెలపండి..
- Finance Market Closing: నష్టాల్లోకి జారుకున్న సెన్సెక్స్-నిఫ్టీ.. ఆ రెండిటిపైనే అందరి కన్ను..
- Sports CSK Playing XI: స్టార్ ప్లేయర్పై వేటు.. LSGతో ఆడే తుదిజట్టు ఇదే
- Technology వన్ప్లస్ 11R 5G కొత్త వేరియంట్ విడుదల.. అమెజాన్లో ఈ కార్డులపై రూ.1000 తగ్గింపు..!
- Automobiles జనాలు ఎక్కువగా కొంటున్న టాప్-3 SUVలు ఇవే.. జాబితాలో లేని టాటా కార్లు!!
- Travel ఒంటిమిట్ట శ్రీ కోదండరామస్వామి ఆలయంలో టీటీడీ అన్నప్రసాదం ప్రారంభం..
విశాల్ సూపర్.. భలే దెబ్బ కొట్టాడు.. తమిళ రాకర్స్ సభ్యులు అరెస్ట్
సినిమా పరిశ్రమను వేధించే సమస్య పైరసీ. పైరసీపై పోరాటంపై తమిళ చిత్రపరిశ్రమ తీవ్ర పోరాటం చేస్తున్నది. తమిళ సినీ నిర్మాతల మండలి తరపుణ హీరో విశాల్ ఎంతో ధైర్యంతో ముందుకెళ్తున్నాడు. వారి అక్రమ వ్యవహారాలను విశాల్ గుట్టురట్టు చేస్తున్నారు. ఇటీవల అక్రమంగా కంటెంట్ను అప్లోడ్ చేస్తున్న ఐదుగురిని అదుపులోకి తీసుకొన్నారు. అసలేం జరిగిందంటే..
అక్రమార్కులపై పైచేయి
ఇటీవల విశాల్ ఓ ప్రెస్మీట్లో మాట్లాడతూ.. అక్రమంగా దక్షిణాది చిత్రాలను వెబ్సైట్లలోకి అప్లోడ్ చేస్తున్న వారిపై కఠిన చర్యలు తీసుకొంటున్నాం. వారితో పోరాటంలో ఒక్క అడుగు ముందుకెస్తే.. మరో అడుగు వెనుక వేసినట్టుగా ఉంటున్నది. ఏదో రోజు అక్రమార్కులపై పైచేయి సాధిస్తాం అని విశాల్ చెప్పుకొచ్చారు. అదే క్రమంలో ఇటీవల తమిళ రాకర్స్, డీవీడీ రాక్సర్ అనే ముఠాకు చెందిన ఐదుగురు సభ్యులను అరెస్ట్ చేయడం తమిళ సినీ పరిశ్రమలో సంచలనం రేపింది.
పైరసీ ముఠా గుట్టురట్టు
వెబ్సైట్లో పెడుతున్న వ్యాపార ప్రకటనల ద్వారా పైరసీ ముఠాను పట్టుకొన్నాం. పట్టుబడిన వ్యక్తులంతా సాంకేతికంగా చాలా అర్హత ఉన్నవారే. ఈ ముఠాలో ఉన్నవారు ఎంఎస్సీ, బీఎస్సీ కంప్యూటర్ సైన్స్ చదువుకొన్నవారే కావడం గమనార్హం అని అన్నారు.
ప్రపంచ దేశాల నుంచి
అక్రమ పైరసీ ముఠాకు చెందిన వీరంత ప్రపంచవ్యాప్తం పలు ప్రదేశాల నుంచి సినిమాలను రికార్డు చేసి ఒక సినిమాగా రూపొందిస్తున్నారు. త్వరలోనే ఈ ముఠాకు చెందిన మరికొందని అరెస్ట్ చేస్తాం అని పైరసీ సెల్ అధికారులు వెల్లడించారు.
పట్టుబడిన వారు వీరే
అక్రమ పైరసీ ముఠాలో పట్టుబడిన వారిలో తమిళఎన్ రాకర్స్ అధినేత ప్రభు, మారియా జాన్, కార్తీ, సురేష్, డీవీడీ రాకర్స్కు చెందిన జాన్సన్, సురేష్, కార్తీ ఉన్నారు. ఈ వ్యాపారం ద్వారా తమిళ రాకర్స్ కోటి రూపాయలు, డీవీడీ రాకర్స్ 75 లక్షలు సంపాదించారు. దాదాపు 19 డోమైన్ల నుంచి వారు సినిమాలను అప్లోడ్ చేస్తున్నారు అని పోలీసులు తెలిపారు.