Don't Miss!
- Finance Blood Bath: వారాంతంలో కుప్పకూలిన మార్కెట్లు.. బేర్స్ చేతిలో Sensex-Nifty..
- Technology Vivo V30e ఇండియా లాంచ్ తేదీ వివరాలు! లీక్ అయిన ధర, స్పెసిఫికేషన్లు
- News టీడీపీ అభ్యర్దుల మార్పు, ఎవరెక్కడ - రఘురామ పై తాజా నిర్ణయం..!!
- Automobiles కేవలం రూ. 8,999లకే డ్యాష్క్యామ్.. ఈ BIS కెమెరా కార్లకు పెట్టుకుంటే చాలు!!
- Sports PBKS vs MI: అతను అసాధారణ బ్యాటింగ్తో భయపెట్టాడు: హార్దిక్ పాండ్యా
- Lifestyle గుడ్నైట్ సందేశాలను ఇలా సరదాగా పంపుకోండి..
- Travel ఒంటిమిట్ట శ్రీ కోదండరామస్వామి ఆలయంలో టీటీడీ అన్నప్రసాదం ప్రారంభం..
వామ్మో.. ఇలాగైతే నేను సినిమాలు ఎలా తీయాలి.. ఓటీటీలపై రోబో డైరెక్టర్ శంకర్ ఆందోళన..
దేశం మెచ్చిన దర్శకుడిగా తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్నాడు శంకర్. రోబో సినిమాతో ఇండియన్ బాక్సాఫీస్ ని షేక్ చేసిన శంకర్ క్రేజ్ ఆ తరువాత ఏ రేంజ్ లో పెరిగిపోయిందో స్పెషల్ గా చెప్పనవసరం లేదు. అయితే అంచనాల డోస్ ఎక్కువ కావడంతో ఆ తరువాత శంకర్ సరైన సక్సెస్ అందుకోవడం లేదు. ఇక ప్రస్తుతం OTTల కాలం నడుస్తుండడంతో ఆయన ఒక వివరణ ఇచ్చారు.
భవిష్యత్తు ఓటీటీలదే అయితే..
కరోనా వైరస్ కారణంగా థియేటర్స్ మూతపడిన విషయం తెలిసిందే. దీంతో కొన్ని సినిమాలు డైరెక్ట్ గా ఓటీటీలో రిలీజ్ అవుతున్నాయి. ఈ విషయంపై శంకర్ స్పందిస్తూ.. ఓటీటీ అనేది థియేటర్స్ లో సినిమాను చూసినంత ఆనందాన్ని ఇవ్వలేదు. ఆ ఎనర్జీని ఈ ఫ్లాట్ ఫార్మ్ మ్యాచ్ చేయలేదని.. భవిష్యత్తు ఓటీటీలదే అయితే..కొంత కన్ఫ్యూజన్ ఉండవచ్చని అన్నారు.
నాకు అర్థం కావడం లేదని
ముఖ్యంగా ఎలాంటి సినిమాలు చేయాలి అనే విషయం నాకు అర్థం కావడం లేదని అన్నారు. కానీ ఎలాగైనా సరే అన్ని వర్గాల వారిని ఆకట్టుకునే విధంగా సినిమాలు చేస్తానని శంకర్ తెలియజేశారు. ప్రస్తుతం తమిళ్ లో చాలా సినిమాకు ఓటీటీలో రిలీజవుతుండడం కూడా మంచిదే అంటూ.. కానీ నిర్మాతకు నష్టాలు రాకుండా ఉంటే సంతోషమని అన్నారు.
మరింత ఆలస్యం..
డైరెక్టర్ శంకర్ ప్రస్తుతం భారతీయుడు సినిమాకు సీక్వెల్ ని రూపొందిస్తున్న విషయం తెలిసిందే. ఈ సినిమాపై అంచనాలు భారీగానే ఉన్నాయి. ఇకపోతే సినిమా ప్రేక్షకుల ముందుకు రావడానికి మరింత ఆలస్యం అయ్యేలా కనిపిస్తోంది. ఇప్పటికే యాక్సిడెంట్ ద్వారా సగం దెబ్బతిన్న చిత్ర యూనిట్ ఇప్పుడు కరోనా లాక్ డౌన్ కారణంగా షూటింగ్ స్టార్ట్ చేయలేని పరిస్థితి ఏర్పడింది.
2022కి షిఫ్ట్ చేసే ఛాన్స్..
2021లో సినిమాను రిలీజ్ చేయాలని అనుకున్నారు. కానీ పరిస్థితులను చూస్తుంటే శంకర్ 2022కి షిఫ్ట్ చేసే ఛాన్స్ ఉన్నట్లు తెలుస్తోంది. కమల్ హాసన్ నటిస్తున్న ఇండియన్ 2 సినిమాపై అంచనాలు అయితే భారీగానే ఉన్నాయి. ఇక 200కోట్లకు పైగా బడ్జెట్ తో నిర్మిస్తున్న ఈ సినిమా తప్పకుండా బాక్సాఫీస్ వద్ద మంచి విజయాన్ని అందుకుంటుందని చిత్ర యూనిట్ చెబుతోంది.