Don't Miss!
- News నరసాపురం నాదే-రెండ్రోజుల్లో ఎన్డీయే అభ్యర్ధిగా ప్రకటన-రఘురామ కామెంట్స్..!
- Sports IPL 2024: రెండుగా చీలిన ముంబై ఇండియన్స్.. హార్దిక్ మాట వినని రోహిత్ గ్రూప్!
- Automobiles నితిన్ గడ్కరీ కీలక ప్రకటన.. వాహనదారులు తప్పక తెలుసుకోవాల్సిందే!
- Technology X ప్లాట్ఫాం ప్రీమియం ఫీచర్లను ఉచితంగా వినియోగించుకోవచ్చు.. వారికి మాత్రమేనని ఎలాన్ మస్క్ ప్రకటన!!
- Lifestyle First Surya Grahan: ఏప్రిల్ నెలలో మొదటి సూర్య గ్రహణం ఎప్పుడు? సూతక కాలం
- Finance Stock Market: లాభాల్లో ముగిసిన సూచీలు.. మార్కెట్ ర్యాలీకి 5 కారణాలివే..
- Travel చారిత్రాత్మకమైన నగరమైన గ్వాలియర్లో సందర్శించాల్సిన ప్రదేశాలివే..!
మళ్లీ భార్యాభర్తలుగా ఒక్కటవుతున్న క్రేజీ హీరో, హీరోయిన్
రీల్ లైఫ్లోనూ రియల్ లైఫ్లోనూ ప్రేమికులుగా వ్యవహరించిన తమిళ స్టార్లు ఆర్య, సాయేషా ఇటీవల పెళ్లి పీటలెక్కి ఒక్కటైన సంగతి తెలిసిందే. హైదరాబాద్లో జరిగిన కార్యక్రమంలో వీరిద్దరూ వివాహం చేసుకోవడం జరిగింది. కొన్నాళ్లు కెరీర్ పరంగా ఎవరికి వారు బిజీగా ఉన్న ఆర్య, ఆయేషా మళ్లీ వెండి తెర మీద జంటగా కనిపించబోతున్నారు.
తమిళంలో మిరుథాన్ చిత్రాన్ని తెరకెక్కించిన శక్తి సౌందర్ రాజన్ దర్శకత్వంలో రాబోయే టెడ్డీ చిత్రంలో ఆర్య, సాయేషా జంటగా నటిస్తున్నారు. వీరిద్దరి పాత్రలు లవ్ అండ్ రొమాంటిక్గా ఉండబోతున్నట్టు సమాచారం.
ఆర్య, సాయేషా జంటగా టెడ్డి చిత్రం స్టూడియో గ్రీన్ బ్యానర్పై జానవేల్ రాజా రూపొందించనున్నారు. ఈ చిత్రానికి డీ ఇమాం సంగీతం అందించనున్నారనే ట్విట్టర్లో వెల్లడించారు. ఈ చిత్రానికి సంబంధించిన పూజా కార్యక్రమాలు శుక్రవారం చెన్నైలో జరిగాయి.
గతంలో ఆర్య, సాయేషా గజనికాంత్ అనే చిత్రంలో కలిసి నటించారు. వారిద్దరూ ఆ సమయంలో ప్రేమలో పడ్డారు. ఆ తర్వాత కేవీ ఆనంద్ దర్శకత్వం వహించిన కాప్పన్ అనే చిత్రంలో నటించారు. మళ్లీ పెళ్లి తర్వాత తెరపైన కనిపిస్తున్నారనే వార్తలతో ఫ్యాన్స్ హ్యపీగా ఫీలవుతున్నారు. పెళ్లి తర్ాత ఆర్య మగముని అనే చిత్రంలో నటిస్తున్న సంగతి తెలిసిందే.