Don't Miss!
- Finance IT News: CEO మైండ్ బ్లాంక్ చేసిన IT ఉద్యోగి.. నెట్టింట పోస్ట్ వైరల్.. ఆ ఒక్క మాటతో..
- News తెలంగాణా కాంగ్రెస్ అభ్యర్థుల ఖరారు నేడే: కాంగ్రెస్ సిఈసి భేటీకి సీఎం రేవంత్ రెడ్డి!!
- Sports Mumbai Indians కెప్టెన్సీ మార్పు వెనుక సచిన్.. కొడుకు కోసం రోహిత్పై వేటు!
- Lifestyle మీ బాయ్ఫ్రెండ్/గర్ల్ఫ్రెండ్లో ఈ మార్పులు ఉంటే మిమ్మల్ని చీట్ చేయడానికి పన్నాగం పడుతున్నారని అర్థం జాగ్రత్త
- Technology గూగుల్ క్రోమ్ భద్రత కోసం సరికొత్త ఫీచర్.. వెబ్సైట్లోకి వెళ్లగానే మాల్వేర్ అటాక్లపై అప్రమత్తం చేస్తుంది!
- Automobiles రైలు కదిలేముందు జర్క్ ఎందుకు ఇస్తుంది.??.. ఆసక్తికర విషయాలివే.!!
- Travel హోలీ సందర్భంగా దేశంలోని ఈ ప్రదేశాలను చుట్టేయండి..!
మళ్లీ భార్యాభర్తలుగా ఒక్కటవుతున్న క్రేజీ హీరో, హీరోయిన్
రీల్ లైఫ్లోనూ రియల్ లైఫ్లోనూ ప్రేమికులుగా వ్యవహరించిన తమిళ స్టార్లు ఆర్య, సాయేషా ఇటీవల పెళ్లి పీటలెక్కి ఒక్కటైన సంగతి తెలిసిందే. హైదరాబాద్లో జరిగిన కార్యక్రమంలో వీరిద్దరూ వివాహం చేసుకోవడం జరిగింది. కొన్నాళ్లు కెరీర్ పరంగా ఎవరికి వారు బిజీగా ఉన్న ఆర్య, ఆయేషా మళ్లీ వెండి తెర మీద జంటగా కనిపించబోతున్నారు.
తమిళంలో మిరుథాన్ చిత్రాన్ని తెరకెక్కించిన శక్తి సౌందర్ రాజన్ దర్శకత్వంలో రాబోయే టెడ్డీ చిత్రంలో ఆర్య, సాయేషా జంటగా నటిస్తున్నారు. వీరిద్దరి పాత్రలు లవ్ అండ్ రొమాంటిక్గా ఉండబోతున్నట్టు సమాచారం.
ఆర్య, సాయేషా జంటగా టెడ్డి చిత్రం స్టూడియో గ్రీన్ బ్యానర్పై జానవేల్ రాజా రూపొందించనున్నారు. ఈ చిత్రానికి డీ ఇమాం సంగీతం అందించనున్నారనే ట్విట్టర్లో వెల్లడించారు. ఈ చిత్రానికి సంబంధించిన పూజా కార్యక్రమాలు శుక్రవారం చెన్నైలో జరిగాయి.
గతంలో ఆర్య, సాయేషా గజనికాంత్ అనే చిత్రంలో కలిసి నటించారు. వారిద్దరూ ఆ సమయంలో ప్రేమలో పడ్డారు. ఆ తర్వాత కేవీ ఆనంద్ దర్శకత్వం వహించిన కాప్పన్ అనే చిత్రంలో నటించారు. మళ్లీ పెళ్లి తర్వాత తెరపైన కనిపిస్తున్నారనే వార్తలతో ఫ్యాన్స్ హ్యపీగా ఫీలవుతున్నారు. పెళ్లి తర్ాత ఆర్య మగముని అనే చిత్రంలో నటిస్తున్న సంగతి తెలిసిందే.