Don't Miss!
- News జగన్ పై దాడి ఘటనలో మరో టర్నింగ్ ! వడ్డెర సంఘాల ఎంట్రీ..
- Lifestyle ఎండాకాలంలో ఈ ఫుడ్స్కు దూరంగా ఉండాలి.. లేదంటే డీహైడ్రేషన్ తప్పదు..
- Technology ధర రూ.1799 కే, Youtube ,UPI ఫీచర్లతో Itel కొత్త ఫీచర్ ఫోన్! సేల్ వివరాలు
- Automobiles ఈవీ ఓనర్లకు Google Maps గుడ్ న్యూస్.. ఇకపై మీకు ఈ టెన్షన్ ఉండదు.!!
- Sports సూర్య సిగ్గుపడాలి.. క్రీడాస్ఫూర్తిని మరిచి నీఛమైన పని!
- Travel తెలంగాణలోని గొంతెమ్మగుట్ట సందర్శనకు బయలుదేరుదామా..?
- Finance Market Closing: మార్కెట్లను వీడిన నిరాశ మేఘాలు.. లాభాల్లో ముగిసిన సెన్సెక్స్-నిఫ్టీ..
మళ్లీ భార్యాభర్తలుగా ఒక్కటవుతున్న క్రేజీ హీరో, హీరోయిన్
రీల్ లైఫ్లోనూ రియల్ లైఫ్లోనూ ప్రేమికులుగా వ్యవహరించిన తమిళ స్టార్లు ఆర్య, సాయేషా ఇటీవల పెళ్లి పీటలెక్కి ఒక్కటైన సంగతి తెలిసిందే. హైదరాబాద్లో జరిగిన కార్యక్రమంలో వీరిద్దరూ వివాహం చేసుకోవడం జరిగింది. కొన్నాళ్లు కెరీర్ పరంగా ఎవరికి వారు బిజీగా ఉన్న ఆర్య, ఆయేషా మళ్లీ వెండి తెర మీద జంటగా కనిపించబోతున్నారు.
తమిళంలో మిరుథాన్ చిత్రాన్ని తెరకెక్కించిన శక్తి సౌందర్ రాజన్ దర్శకత్వంలో రాబోయే టెడ్డీ చిత్రంలో ఆర్య, సాయేషా జంటగా నటిస్తున్నారు. వీరిద్దరి పాత్రలు లవ్ అండ్ రొమాంటిక్గా ఉండబోతున్నట్టు సమాచారం.
ఆర్య, సాయేషా జంటగా టెడ్డి చిత్రం స్టూడియో గ్రీన్ బ్యానర్పై జానవేల్ రాజా రూపొందించనున్నారు. ఈ చిత్రానికి డీ ఇమాం సంగీతం అందించనున్నారనే ట్విట్టర్లో వెల్లడించారు. ఈ చిత్రానికి సంబంధించిన పూజా కార్యక్రమాలు శుక్రవారం చెన్నైలో జరిగాయి.
గతంలో ఆర్య, సాయేషా గజనికాంత్ అనే చిత్రంలో కలిసి నటించారు. వారిద్దరూ ఆ సమయంలో ప్రేమలో పడ్డారు. ఆ తర్వాత కేవీ ఆనంద్ దర్శకత్వం వహించిన కాప్పన్ అనే చిత్రంలో నటించారు. మళ్లీ పెళ్లి తర్వాత తెరపైన కనిపిస్తున్నారనే వార్తలతో ఫ్యాన్స్ హ్యపీగా ఫీలవుతున్నారు. పెళ్లి తర్ాత ఆర్య మగముని అనే చిత్రంలో నటిస్తున్న సంగతి తెలిసిందే.