Don't Miss!
- News Lok Sabha Election 2024: నేడే తొలి దశ పోలింగ్, 102 స్థానాల్లో ఎన్నికలకు సర్వం సిద్ధం
- Sports PBKS vs MI: అతను అసాధారణ బ్యాటింగ్తో భయపెట్టాడు: హార్దిక్ పాండ్యా
- Lifestyle గుడ్నైట్ సందేశాలను ఇలా సరదాగా పంపుకోండి..
- Technology 40 గంటలకు పైగా బ్యాటరీ బ్యాకప్, ChatGPT వాయిస్ AI సపోర్టుతో నథింగ్ ఇయర్బడ్స్ విడుదల.. సేల్ వివరాలు!
- Automobiles గొప్ప మనసు చాటుకున్న రాఘవ లారెన్స్.. దివ్యాంగులకు టీవీఎస్ స్కూటర్ల పంపిణీ
- Finance Market Closing: నష్టాల్లోకి జారుకున్న సెన్సెక్స్-నిఫ్టీ.. ఆ రెండిటిపైనే అందరి కన్ను..
- Travel ఒంటిమిట్ట శ్రీ కోదండరామస్వామి ఆలయంలో టీటీడీ అన్నప్రసాదం ప్రారంభం..
త్రిషకు ట్విస్ట్ ఇచ్చి ఆఫర్ ఎత్తుకుపోయిన తాప్సీ
తాజాగా త్రిష అవకాశాన్ని తాప్సీ కొట్టుకుపోయింది. ఈ విషయం తమిళ చిత్ర పరిశ్రమలో హాట్ టాపిక్ అయ్యింది. తెలుగు చిత్రం ఝుమ్మంది నాదంతో తెరపైకి వచ్చి అందర్నీ ఆకట్టుకున్న తాప్సి ఇప్పుడు తమిళ చిత్ర రంగంలోకి ప్రవేశించారు. ఆడుగళం చిత్రంలో ధనుష్కు జంటగా నటిస్తున్నారు. అనంతరం జీవాకు జంటగా వందాన్ వెండ్రాన్ చిత్రంలో నటించనున్నారు. ఆడుగళం చిత్రంలో మొదట త్రిషను ఎంపిక చేశారు. ఇప్పుడా అవకాశాన్ని తాప్సికి ఇవ్వడం జరిగింది. రాత్రికి రాత్రే ఈ మార్పు ఎలా జరిగిందన్నవిషయంపై రకరకాల గుసగుసలు వినపడుతున్నాయి.హీరో జీవాను వ్యక్తిగతంగా కలవటమే తాప్సీ చేసిన తెలివైన పని అంటున్నారు. ఆమెను అతి దగ్గరగా చూసిన జీవా ప్లాట్ అయి ఈ పాత్రకు నీవే సరిపోతావని చెప్పి దర్శకుడుని ఒప్పించి ఆఫర్ ఇప్పించాడని అంటున్నారు. ఇక మీడియావారు తాప్సీని...త్రిషను తొలగించడానికి మీరే కారణమా అని అడగ్గా ఝుమ్మంది నాదం ఇటీవలే విడుదలైందని, దాన్ని చూసి దర్శక నిర్మాతలు అవకాశాలు ఇస్తున్నారని తెలిపారు. ఆడుగుళం చిత్రంలో తన పాత్రలో మొదట త్రిషను ఎంపిక చేసిన విషయం తెలిసిందన్నారు. ఎందుకు మార్చారో తనకు తెలియదని, దర్శకుడు ఆ పాత్రను తాను చేయాల్సిందిగా కోరారని, అందుకు అంగీకరించానని చెప్పారు. అలాగే ప్రస్తుతం తాను ధనుష్తో నటిస్తున్నానని, ఆ అనుభవం మరువలేనిదని తాప్సి అన్నారు. మొత్తానికి తాప్సీ కూడా తక్కువదేమీ కాదని నిరూపించుకుంది.