Don't Miss!
- Finance HUL: రూ.24 డివిడెండ్ ప్రకటించిన హిందుస్థాన్ యూనిలీవర్..
- News వివేకా కేసులో మరో అనూహ్య ట్విస్ట్- విచారణ నుంచి తప్పుకున్న జడ్జి..!
- Automobiles కొత్త ఆస్టన్ మార్టిన్ వాంటేజ్ కూల్ స్పోర్ట్స్ కారు లాంచ్.. గంటకు 325 కి.మీ వేగం.. ధర, ఫీచర్లు ఇవే..
- Technology Nokia మాతృ సంస్థ HMD నుంచి మూడు కొత్త ఫోన్లు లాంచ్! ధర, స్పెసిఫికేషన్ల వివరాలు
- Sports సూపర్మ్యాన్ స్టబ్స్: మెరుపు ఫీల్డింగ్తో ఢిల్లీని గెలిపించాడు! Video
- Lifestyle పెళ్లైన వ్యక్తితో డేటింగా? కాస్త ముందు..వెనకా ఆలోచించండి..లేదంటే కొంప కొల్లేరే..!
- Travel కేవలం రూ. 5వేలతో హిమాచల్ప్రదేశ్లోని ఈ ప్రాంతాలను చుట్టేయొచ్చు..!
ఫెస్టివల్స్ ను తెలుగు ఫిలిం ఛాంబర్ నిర్లక్ష్యం చేస్తోంది
చెన్నై అంతర్జాతీయ చలన చిత్రోత్సవాల్లో తెలుగు చిత్రాలు ప్రదర్శనకు నోచుకోకపోవడం విచారకరమని ప్రముఖ నిర్మాత, దక్షిణ భారత చలన చిత్ర వాణిజ్యమండలి మాజీ కార్యదర్శి కాట్రగడ్డ ప్రసాద్ ఆవేదన వ్యక్తం చేసారు. ఈ నెల 15న చెన్నైలో జరగనున్న చెన్నై ఎనిమిదవ అంతర్జాతీయ చలన చిత్రోత్సవాల్లో తెలుగు చిత్రాలను నమోదు చేసుకోవలసిందిగా తెలుగు ఫిలిం చాంబర్కు లేఖ రాసినా స్పందన రాకపోవడం విచారకరమన్నారు. ఈ చిత్రోత్సవంలో తమిళ చిత్రాలతో పాటు 64 దేశాలకు చెందిన చిత్రాలు ప్రదర్శింపబడుతున్నాయని తెలిపారు. తెలుగు చిత్ర పరిశ్రమ అంతర్జాతీయ చలన చిత్రోత్సవాలపై ఆసక్తి చూపడం లేదని అన్నారు. గోవాలో జరిగిన చిత్రోత్సవంలోనూ తెలుగు చిత్రాల ప్రదర్శన లేకపోవడం తీరని లోటుగా భావిం చారు. 15వ తేదీ నుంచి చెన్నైలో ప్రారంభంకానున్న చెన్నై ఎనిమిదవ అంతర్జాతీయ చలన చిత్రోత్సవంలో ఒర్ ఇరవు, నందలాలా తదితర 12 తమిళ చిత్రాలు ప్రదర్శించనున్నారు. ఈ కమిటీలో దర్శకుడు సింగీతం శ్రీనివాసరావు, చారుహాసన్, నటిఅర్చన సభ్యులుగా ఉంటారు.