Don't Miss!
- Finance HUL: రూ.24 డివిడెండ్ ప్రకటించిన హిందుస్థాన్ యూనిలీవర్..
- News వివేకా కేసులో మరో అనూహ్య ట్విస్ట్- విచారణ నుంచి తప్పుకున్న జడ్జి..!
- Automobiles కొత్త ఆస్టన్ మార్టిన్ వాంటేజ్ కూల్ స్పోర్ట్స్ కారు లాంచ్.. గంటకు 325 కి.మీ వేగం.. ధర, ఫీచర్లు ఇవే..
- Technology Nokia మాతృ సంస్థ HMD నుంచి మూడు కొత్త ఫోన్లు లాంచ్! ధర, స్పెసిఫికేషన్ల వివరాలు
- Sports సూపర్మ్యాన్ స్టబ్స్: మెరుపు ఫీల్డింగ్తో ఢిల్లీని గెలిపించాడు! Video
- Lifestyle పెళ్లైన వ్యక్తితో డేటింగా? కాస్త ముందు..వెనకా ఆలోచించండి..లేదంటే కొంప కొల్లేరే..!
- Travel కేవలం రూ. 5వేలతో హిమాచల్ప్రదేశ్లోని ఈ ప్రాంతాలను చుట్టేయొచ్చు..!
వడివేలు పై తెలుగువారు ఫైర్.. ఇల్లు ముట్టడి(ఫోటో ఫీచర్)
చెన్నై : 'తెనాలిరామన్' చిత్ర ప్రదర్శనను రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ నగరంలోని తెలుగు సంఘాల ప్రతినిధులు శనివారం ఆ చిత్ర హీరో వడివేలు ఇంటివద్ద ఆందోళన నిర్వహించారు.
'తెనాలిరామన్' సినిమా విడుదలను ఆపాలని తెలుగు సంఘాలు రాష్ట్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశాయి. తెలుగు భాష, కళలు, సాహిత్యాభివృద్ధికి విశేషంగా కృషి చేసిన శ్రీకృష్ణదేవరాయుల పాత్రను తెలుగువారి మనోభావాలు దెబ్బతినేలా చిత్రీకరించారన్నారు.
'తమిళనాడు తెలుగు మక్కల్ పేరవై' అధ్యక్షుడు బాలగురుస్వామి నేతృత్వంలో ఆయన మద్దతుదారులు ఆందోళనలో పాల్గొని తమ నిరసన వ్యక్తం చేశారు. వారికి తమిళనాడు తెలుగు యువశక్తి అధ్యక్షుడు కేతిరెడ్డి జగదీశ్వర రెడ్డి మద్దతు తెలుపుతూ ఆందోళనలో పాల్గొన్నారు. సమాచారం అందిన వెంటనే పోలీసులు అక్కడికి చేరుకొని వారిని అరెస్టు చేశారు.
మిగిలిన సమాచారం స్లైడ్ షోలో...
అవహేళన...
తెలుగు కోసం విశేషకృషి చేసిన చక్రవర్తి పాత్రను వక్రీకరించి చూపటం తగదని తెలుగు సంఘాల వారు అన్నారు. తెలుగు, తమిళం, కన్నడ భాషల్లో మహానటులు పోషించిన పాత్రను హాస్యనటుడితో వేయించి అవహేళన చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. వివాదం మొదలైన తర్వాత సరి చేసుకోమని కోరినా నిర్మాతలు అంగీకరించటం లేదన్నారు.
ఆందోళనకు దిగుతాం...
ఇప్పటికే గవర్నర్, రాష్ట్ర ప్రభుత్వానికి, వివిధ విభాగాల ఉన్నతాధికారులకు వినతిపత్రాలు అందించామన్నారు. మార్పులు చేయకుండా థియేటర్లలోకి తీసుకురావాలని ప్రయత్నిస్తే ఆందోళనలకు దిగుతామన్నారు. న్యాయ పోరాటానికి కూడా సిద్ధమవుతున్నాయని ప్రకటించారు.
ధియోటర్స్ ఉండవు
ఎట్టి పరిస్థితుల్లోనూ ప్రదర్శించకూడదని ముక్తకంఠంతో కోరారు. పొరుగునున్న కర్ణాటకలో ప్రదర్శనకు థియేటర్ల నిర్వాహకులు నిరాకరించిన విషయాన్ని గుర్తుచేశారు.
వడివేలు మాట్లాడుతూ...
'' 'ఇంసై అరసన్ 23మ్ పులికేసి' తర్వాత నేను ఎదురుచూసిన కథే 'తెనాలిరామన్'. దర్శకుడు యువరాజ్ కథ చెప్పగానే నటించేందుకు అంగీకరించా. కల్పాతి అగోరం ఈ సినిమాను నిర్మించేందుకు సిద్ధమయ్యారు. అయితే కొందరు వాళ్లను బెదిరించారు. దీన్ని వారు సవాలుగా తీసుకున్నారు. అయితే నిర్మాత కల్పాతి ధైర్యాన్ని మెచ్చుకోవాల్సిందే. ఇదివరకు లేని స్థాయిలో ఈ సినిమా కోసం ఎక్కువగా శ్రమించాను. నా గత చిత్రాలతో పోలిస్తే నవ్వుల జల్లులు ఎక్కువే.
అలాగే...
'ఎవరూ చేయని తప్పేమైనా చేశావా. ఇదంతా సహజమే..' అని నిర్మాత నన్ను ఓదార్చారు. నా మాదిరిగానే నా సహనటులు, సాంకేతిక కళాకారులు తీవ్రంగా శ్రమించారు. 'అసలు సినిమా సెట్నే తీసేశారు..', 'ఇక ఆ సినిమా లేదు' వంటి వార్తలన్నీ వచ్చాయి. కానీ వాటన్నింటినీ దాటి ఈ సినిమాను పూర్తి చేశాం అన్నారు.
ద్విపాత్రాభినయం
ఇక '..23వ హింసించే రాజు పులికేసి'లో మాదిరిగానే ఇందులోనూ నాది ద్విపాత్రాభినయం. మహారాజు, తెనాలిరామన్గా రెండు పాత్రలు పోషిస్తున్నా. తమిళనాడులోని ప్రతి ఒక్కరూ తమ ఇంటి బిడ్డలా నన్ను చూసుకుంటున్నారు. వారి రేషన్ కార్డులో పేరు లేదే తప్ప.. నేను అందరి ఇంటి బిడ్డని. ఇటీవల వచ్చిన సినిమాలను నేను పెద్దగా చూడలేదు. గౌండమణి, సంతానం హీరోలుగా నటిస్తున్నారని విన్నా. చాలా సంతోషంగా ఉంది. అందరికీ నా శుభాకాంక్షలు అన్నారు.
భారీ బడ్జెట్
'23మ్ పులికేసి' వంటి చరిత్రాత్మక కథలో నటించి.. రెండు భిన్నమైన పాత్రలు పోషించి ప్రేక్షకులను వడివేలు కడుపుబ్బా నవ్వించిన సంగతి తెలిసిందే . గత కొంతకాలంగా తెరకు దూరమైన ఆయన ప్రస్తుతం సరికొత్తగా మళ్లీ తెరపైకి వస్తున్నారు. 'జగజ్జాల భుజబల తెనాలిరామన్' చిత్రంలో ఆయన శ్రీకృష్ణ దేవరాయులు, తెనాలిరాముడి పాత్రలను పోషిస్తున్నారు. పూర్తి కామెడీ తో రూపొందే ఈ సినిమా చిత్రీకరణ పూర్తయింది. యువరాజ్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని ఏజీఎస్ ఎంటర్టైన్మెంట్ రూ.25 కోట్లతో తెరకెక్కిస్తోంది.
గతంలో...
రోజుకు రూ.5 నుంచి రూ.8 లక్షల వరకూ వసూలు చేసిన స్టార్ కమిడియన్ వడివేలు.ఆయన గత మూడేళ్లుగా చేతిలో ఒక్క సినిమా కూడా లేక పూర్తి ఖాళిగా ఉన్నాడు. దానికి కారణం రజనీకాంత్ తో వడివేలు తగువు పెట్టుకోవటమే. రజనీ నటించాల్సిన 'రాణా' చిత్రం నుంచి వడివేలును తొలగిస్తున్నట్లు ప్రకటించారు.
రజనీతో తగువు కారణం..
రజనీకాంత్ అన్నాడీఎంకే గుర్తుపై ఓటేసినట్లు మీడియాలో పొక్కడంతో అసహనానికి గురైన వడివేలు.. 'రజనీ గిజనీ జాన్తానై.. అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు వెలువడినరోజు వీరందరి సంగతి తేలుస్తా' అని ప్రకటించారు. ఇది కూడా పరిశ్రమలోని రజనీ మద్దతుదారుల కోపానికి కారణమైంది. ఈ నేపథ్యంలో వడివేలుకు ఒక్క సినిమా కూడా లేకపోయింది. గతంలోనూ మరో స్టార్ హీరో విజయ్ కాంత్ తో తగువు పెట్టుకున్నాడు. ఆ గొడవ వడివేలు నివాస స్దలం వద్ద మొదలైంది.
క్రేజ్...
సినిమాపై వివాదమే ఈ చిత్రానికి క్రేజ్ తెచ్చి పెడుతోంది. ఈ సినిమా కామెడీ కావటం, వడివేలు గత కొంతకాలంగా తెరకు దూరం కావటంతో ఆయన అభిమానులు, హాస్యాభిమానులు ఈ చిత్రం విడుదల కోసం ఎదురుచూస్తున్నారు. దాంతో మంచి ఓపినింగ్స్ వస్తాయని భావిస్తున్నారు. తెలుగులోనూ డబ్బింగ్ అయ్యి ఈ చిత్రం విడుదల అయ్యే అవకాసం ఉంది.