Don't Miss!
- Sports PBKS vs MI: చరిత్ర సృష్టించిన రోహిత్ శర్మ!
- News ఏపీ సచివాలయ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు వెంకట్రామిరెడ్డిపై సస్పెన్షన్ వేటు
- Lifestyle గుడ్నైట్ సందేశాలను ఇలా సరదాగా పంపుకోండి..
- Technology 40 గంటలకు పైగా బ్యాటరీ బ్యాకప్, ChatGPT వాయిస్ AI సపోర్టుతో నథింగ్ ఇయర్బడ్స్ విడుదల.. సేల్ వివరాలు!
- Automobiles గొప్ప మనసు చాటుకున్న రాఘవ లారెన్స్.. దివ్యాంగులకు టీవీఎస్ స్కూటర్ల పంపిణీ
- Finance Market Closing: నష్టాల్లోకి జారుకున్న సెన్సెక్స్-నిఫ్టీ.. ఆ రెండిటిపైనే అందరి కన్ను..
- Travel ఒంటిమిట్ట శ్రీ కోదండరామస్వామి ఆలయంలో టీటీడీ అన్నప్రసాదం ప్రారంభం..
అజిత్ ఫ్యాన్స్కు షాక్.. షూటింగ్లో గాయాలు
తమిళ నాట అజిత్కు ఉండే మాస్ ఫాలోయింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. వరుస హిట్లతో బాక్సాఫీస్ను షేక్ చేస్తున్న అజిత్.. చివరకు పింక్ రీమేక్తో అదరగొట్టాడు. నేర్కొండ పార్వైగా తెరకెక్కించిన ఆ సినిమా బాక్సాఫీస్ వద్ద మంచి విజయాన్నే అందుకుంది. మళ్లీ అదే కాంబినేషన్లో అజిత్ మరో చిత్రాన్ని చేస్తున్న సంగతి తెలిసిందే.
బోనీ కపూర్ నిర్మాణంలో హెచ్ వినోద్ ఈ చిత్రాన్ని నేర్కొండపార్వైను తెరకెక్కించిన సంగతి తెలిసింది. మళ్లీ ఇదే కాంబోలో మరో నూతన చిత్రాన్ని చేస్తున్నాడు అజిత్. వలిమై అంటూ టైటిల్ టైటిల్ ప్రకటించి.. డిసెంబర్లో షూటింగ్ కూడా మొదలెట్టేశారు. తాజాగా ఈ మూవీకి సంబంధించిన షాకింగ్ న్యూస్ బయటకు వచ్చింది.
అజిత్ యాక్షన్ సీక్వెన్స్ను డూప్ సహాయం లేకుండా చేస్తాడన్న సంగతి తెలిసిందే. అజిత్ స్వతహాగా బైక్ రేసర్ కూడా. అయితే తాజాగా వలిమై షూటింగ్ జరుగుతుండగా.. బైక్ యాక్షన్ సీక్వెన్స్లో అజిత్కు గాయాలైనట్టు తెలుస్తోంది.
అయినా సరే షూటింగ్కు ఆటంకం కలగకూడదని పూర్తి చేశాడట. అనంతరం ఆసుపత్రికి వెళ్లగా కొద్ది రోజులు విరామం తీసుకోవాలని సలహా ఇవ్వడంతో.. షెడ్యూల్ వాయిదా పడ్డట్టు సమాచారం. తదుపరి షెడ్యూల్ కోసం అజిత్ హైద్రాబాద్ రానున్నట్లు తెలుస్తోంది.