Don't Miss!
- News Modi-Hanuman Chalia:హనుమాన్ ఛాలీసాపై ప్రధాని మోదీ వివాదాస్పద వ్యాఖ్యలు..!
- Finance Banking News: ప్రభుత్వ బ్యాంకులకు ఆ అధికారం లేదు.. బాంబే హైకోర్టు సంచలన తీర్పు..
- Automobiles వందేళ్ల వయసులో తాత జోరు.. 50 ఏళ్ల ప్రీమియర్ పద్మినిలో షికారు.. వీడియో చూసేయండి
- Sports IPL: నైట్ అంతా సిట్టింగ్ వేస్తే ఎలా గెలుస్తారు?- రైనా
- Technology అద్భుతమైన డిజైన్ తో నోకియా కొత్త ఫోన్ Nokia N90 Flip ! వివరాలు
- Lifestyle నిద్రపోకపోతే వచ్చే సమస్యలివే.. తీవ్రంగా హెచ్చరిస్తున్న పరిశోధకులు..!
- Travel ఫ్యామిలీ ట్రిప్ ప్లాన్ చేస్తున్నారా? అయితే, తెలంగాణలోని ఈ ప్రాంతం బెస్ట్..!
రజనీకాంత్ 167 టైటిల్ కేక.. చాలా రోజుల తర్వాత కరుడగట్టిన ఖాకీగా తలైవా
Recommended Video
తన కెరీర్లో 167 సినిమాగా సూపర్ స్టార్ రజనీకాంత్ నటిస్తున్న చిత్రం టైటిల్ను ప్రకటించారు. ప్రముఖ దర్శకుడు ఏఆర్ మురుగదాస్ రూపొందిస్తున్న ఈ చిత్రానికి దర్బార్గా నామకరణం చేశారు. ఈ చిత్రంలో నయనతార హీరోయిన్గా నటిస్తున్న సంగతి తెలిసిందే. మరో కీలక పాత్రలో నివేదా థామస్ కనిపిస్తారు. ఈ సినిమా వివరాల్లోకి వెళితే...
|
ఖాకీ డ్రస్సులో రజనీ
ప్రముఖ నిర్మాణ సంస్థ లైకా ప్రొడక్షన్ రూపొందిస్తున్న దర్బార్ చిత్రంలో రజనీకాంత్ ఐపీఎస్ ఆఫీసర్గా నటిస్తున్నారు. చాలా కాలం తర్వాత మళ్లీ ఖాకీ డ్రస్సులో సూపర్ స్టార్ కనిపించడం విశేషం. అయితే మళ్లీ ముంబై బ్యాక్ డ్రాప్తోనే ఈ సినిమా తెరకెక్కుతున్నట్టు ఫస్ట్లుక్లో ఆనవాళ్లు కనిపించాయి. ఇంకా టైటిల్ ప్రకటనలో సినిమా గురించి పెద్దగా సమాచారం అందించకపోవడం గమనార్హం.
ద్విపాత్రిభినయంతో తలైవా
రజనీకాంత్ చాలా రోజుల తర్వాత మళ్లీ ద్విపాత్రాభినయంతో ప్రేక్షకుల ముందుకు వస్తున్నాడు. పోలీస్ అధికారిగా, సామాజిక కార్యకర్తగా రెండు విభిన్నమైన పాత్రల్లో నటిస్తున్నారు. గతంలో మూండ్రూ ముగం, పాండ్యన్, కోడి పరకుతు అనే చిత్రాల్లో పోలీసు పాత్రలో కనిపించారు.
రజనీ కూతురుగా నివేదా థామస్
దర్బార్ చిత్రంలో రజనీకాంత్కు కూతురుగా నివేదా థామస్ నటిస్తున్నట్టు వార్తలు వచ్చాయి. అయితే అధికారికంగా ఎలాంటి ప్రకటన ఇంకా రాలేదు. అయితే ఇటీవల ఆమె పాత్రకు సంబంధించిన ఫోటోషూట్ను నిర్వహించినట్టు తమిళ మీడియాలో వార్తలు వెలువడ్డాయి. అయితే అటు లైకా నుంచి గానీ, నివేదా నుంచి గానీ ఎలాంటి సమాచారం లేకపోవడంతో ఈ వార్త నిజమేనా అనే చర్చ జరుగుతున్నది.
హీరోయిన్గా నయనతార
దర్బార్ సినిమా షూటింగ్ బుధవారం ప్రారంభం కానున్నది. చంద్రముఖి, కుచేలన్, శివాజీలో రజనీకాంత్ కలిసి నటించిన నయనతార ఈ చిత్రంలో హీరోయిన్. సంతోష్ శివన్ సినిమాటోగ్రాఫర్గా, అనిరుధ్ రవిచందర్ మ్యూజిక్ డైరెక్టర్గా వ్యవహరిస్తారు. వచ్చే ఏడాది పొంగల్కు ఈ సినిమా రిలీజ్ కానున్నది.