1960 లో ఎన్టీ రామారావు,సావిత్రి జంటగా నటించి ఘన విజయం సాధించిన శ్రీనివాస కళ్యాణం సినిమా తమిళ వెర్షన్ తిరిగి రిలీజవుతోంది. అయితే దాదాపు 48 ఏళ్ళ అనంతరం రిలీజవుతున్న ఈ సినిమాకు ఓ ప్రత్యేకత ఉంది. అది బ్లాక్ అండ్ వైట్ లో ఉన్న ఈ సినిమాని కలర్ లోకి మార్చి రిలీజ్ చేయటం. దీని నిమిత్తి ఓ.కె ఫిలిమ్స్ వారు పది లక్షలు రూపాయలకు పైగా ఖర్చు పెట్టారు. ఇక ఈ సినిమాలో ప్రముఖ సంగీత దర్శకుడు ఎమ్.ఎస్ .విశ్వనాధన్ చేత రెండు పాటలను ఫ్రెష్ గా కంపోజ్ చేయించి కలపటం మరో విశేషం. అలాగే కొన్ని సన్నివేశాలను సాంకేతిక కారణాల వల్ల తొలిగించారుట. ఈ నెల 19న ఈ కళాఖండాన్ని రిలీజ్ చేస్తున్నారు.దాంతో ఈ విషయంలో మన వాళ్లు కన్నా తమిళం వారే బెటర్ అన్పించటం సహజం.