Don't Miss!
- News వైసీపీకి బీఆర్ఎస్ గతే: గంటా శ్రీనివాసరావు సంచనల వ్యాఖ్యలు
- Sports LSG vs CSK: రప్ఫాడించిన రాహుల్... లక్నో ఘన విజయం
- Automobiles వెస్పా 140 వ యానివర్సరీ వేడుకలు.. స్పెషల్ ఎడిషన్ స్కూటర్ లాంచ్..
- Lifestyle వేసవిలో కిడ్నీలు భద్రంగా ఉండాలంటే రోజూ ఎన్ని గ్లాసుల నీళ్లు తాగాలో తెలుసా?
- Technology రియల్మి ప్యాడ్ 2 వైఫై వేరియంట్ సేల్ ప్రారంభం.. రూ.2000 తగ్గింపు.. ఆఫర్ కొన్నిరోజులు మాత్రమే..!!
- Travel తెలంగాణలోని గొంతెమ్మగుట్ట సందర్శనకు బయలుదేరుదామా..?
- Finance Market Closing: మార్కెట్లను వీడిన నిరాశ మేఘాలు.. లాభాల్లో ముగిసిన సెన్సెక్స్-నిఫ్టీ..
సినిమా డైరక్టర్ ని అసెస్టెంట్ తుపాకి తో బెదిరించి...
చెన్నై : తమిళ చిత్ర పరిశ్రమకు చెందిన ఓ సినీ దర్శకుడి కార్యాలయంలో చోరీ జరిగింది. అయితే దొంగతనానికి పాల్పడింది మరెవరో కాదు అసిస్టెంట్ దర్శకుడు. దాంతో అందరూ ఈ విషయమై షాక్ అయ్యారు. దర్శకుడుగా జాయన్ అవుదామని వచ్చేవారని పెద్దగా ఎంక్వైరీ చేయకుండా పనిలోకి తీసుకుంటే ఇలాంటి సమస్యలు ఎదురు అవుతాయని అంటున్నారు.
ఫేస్బుక్ ద్వారా లేటెస్ట్ అప్డేట్స్ ఎప్పటికప్పుడు
పూర్తి వివరాల్లోకెళితే....
స్థాపిక వలసరవాక్కంకు చెందిన దర్శకుడు తంజై కె సరవణన్. ఆయన జమున ఫిలింస్ ఇంటర్నేషనల్ పేరుతో చిత్ర నిర్మాణం నెలకొల్పి ప్రస్తుతం మిస్ పన్నాదీంగ అప్పరం వరుత్తపడువీంగ అనే చిత్రాన్ని స్వీయ దర్శకత్వంలో నిర్మిస్తున్నారు. తంజై కె సరవణన్ కార్యాలయం వలసరవాక్కం,వెంకటేశ్వర నగర్ 2వ వీధి లో ఉంది.
దర్శకుడు తంజై కె సరవణన్ తన కార్యలయంలో ఉండగా ఆయన వద్ద సహాయ దర్శకుడి గా పనిచేసే ప్రభాకర్ అనే వ్యక్తి కొందరు దుండగులతో వచ్చి తుపాకీ,కత్తులతో బెదిరించి 40 సవర్ల బంగారం *2లక్షల నగదు దోచుకెళ్లాడు. తంజై కె శరవణన్ బుధవారం పోలీసు కమిషనర్కు పిర్యాదు చేశారు.