Don't Miss!
- News బీజేపీలో చేరిన నల్లమిల్లి రామకృష్ణా రెడ్డి: ఆ నియోజకవర్గం నుంచే పోటీ
- Sports CSK vs LSG: అతని వల్లే గెలిచే మ్యాచ్లో ఓడాం: రుతురాజ్ గైక్వాడ్
- Lifestyle ఈ 4 రాశుల వారు ఉత్తమ సెక్స్ భాగస్వాములు అవుతారు... వీరిని లైఫ్ పార్ట్నర్ గా పొందడం అదృష్టం!
- Automobiles ఏథర్ రిజ్టా ఎలక్ట్రిక్ స్కూటర్కు పోటీగా ఆంపియర్ NXG.. ఆ రోజే లాంచ్
- Technology ధర రూ.10 వేల కంటే తక్కువ ధరకే రియల్మి 5G స్మార్ట్ఫోన్.. విడుదల తేదీ ఖరారు..!
- Finance Market Closing: లాభాల్లో ముగిసిన సెన్సెక్స్-నిఫ్టీ.. మార్కెట్లను లాగిన మెటల్ స్టాక్స్..
- Travel ఫ్యామిలీ ట్రిప్ ప్లాన్ చేస్తున్నారా? అయితే, తెలంగాణలోని ఈ ప్రాంతం బెస్ట్..!
నన్ను దెబ్బ తీయాలనే..నమిత
నమిత తాజాగా తనపై కుట్ర జరుగుతోందంటూ వాపోతోంది. తన లేటెస్ట్ ఫిల్మ్ జగన్మోహిని ఈ నెల పదిహేడున రిలీజ్ అవుతున్న సమయంలో తన పాత ఫ్లాఫ్ సినిమాలను కావాలని రిలీజ్ చేస్తున్నారని చెప్తోంది.తెలుగులో నాలుగేళ్ళ క్రితం రిలీజైన నాయకుడుని డబ్ చేసి తమిళనాడులో రిలీజ్ చేయటం అందులో భాగమేనంటోంది. ఆ విషయమై మాట్లాడుతూ..ఆ తెలుగు వెర్షన్ వచ్చి నాలుగేళ్ళు అవుతోంది.అప్పట్లో ఆ చిత్రం కేవలం రాజశేఖర్ అభిమానులను అలరించటానికి తీసింది. ముఖ్యంగా నా పాత్ర పాటలకే పరిమితం. ఆ చిత్రం నన్న బ్యాడ్ గా ప్రాజెక్టు చేసింది. భాక్సాఫీస్ వద్ద నిలబడలేదు..అలాంటి చిత్రాన్నినా జగన్మోహిని చిత్రం రిలీజ్ ముందు రిలీజ్ చేస్తున్నారంటే అర్ధం ఏమిటి..ఇదంతా నా దురదృష్టం..అంటూ వాపోయింది.
ఇక రాజా హీరోగా నమిత, మీరా చోప్రా ప్రధానపాత్రులగా మురళి సినీ ఆర్ట్స్ పతాకంపై హెచ్. మురళి నిర్మించిన చిత్రం 'జగన్మోహిని'. ఎన్.కె. విశ్వనాథన్ దర్శకత్వంలో తెలుగు, తమిళ భాషల్లో ఏకకాలంలో రూపొందిన ఈ సినిమాని ఈనెల 17న విడుదల చేయనున్నామని నిర్మాత తెలిపారు. అలాగే వినోదభరితంగా తయారయిన చిత్రమిది.అండమాన్ దగ్గర సముద్రంలో తీసిన అండర్ వాటర్ సన్నివేశాలు సినిమాకి హైలైట్ అవుతాయి. నమిత నటన, ఆమె గ్లామర్ ఈ సినిమాకి ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తాయి అన్నారు.