Don't Miss!
- Finance Medicines News: కిరాణా కొట్టులో మందుల విక్రయం.. మోదీ సర్కార్ సంచలన నిర్ణయం..!!
- Lifestyle ప్రాణాలకు ముప్పు ఉందని తెలిపే హీట్ స్ట్రోక్ లక్షణాలు
- Technology Truecaller Spam Model స్పామ్ కాల్స్కు చెక్ పెట్టేందుకు ట్రూకాలర్ కొత్త టూల్ విడుదల..!
- News ప్రచారం పక్కనపెట్టి గర్భిణీకి ప్రసవం.. దర్శి టీడీపీ అభ్యర్థికి హ్యాట్సాఫ్!!
- Sports అనూహ్య ఘటనను ఎదుర్కొన్న రోహిత్ శర్మ
- Travel ట్రైన్ జర్నీలో ఆరు రోజులపాటు సాగే తిరుపతి టు ఊటీ టూర్ ప్యాకేజీ..వివరాలివే..!
- Automobiles 25 దేశాల్లో రాయల్ ఎన్ఫీల్డ్ బైక్ రెంటల్స్ అండ్ టూర్స్ సర్వీస్.. RE ఫ్యాన్స్కు పండగే
నన్ను దెబ్బ తీయాలనే..నమిత
నమిత తాజాగా తనపై కుట్ర జరుగుతోందంటూ వాపోతోంది. తన లేటెస్ట్ ఫిల్మ్ జగన్మోహిని ఈ నెల పదిహేడున రిలీజ్ అవుతున్న సమయంలో తన పాత ఫ్లాఫ్ సినిమాలను కావాలని రిలీజ్ చేస్తున్నారని చెప్తోంది.తెలుగులో నాలుగేళ్ళ క్రితం రిలీజైన నాయకుడుని డబ్ చేసి తమిళనాడులో రిలీజ్ చేయటం అందులో భాగమేనంటోంది. ఆ విషయమై మాట్లాడుతూ..ఆ తెలుగు వెర్షన్ వచ్చి నాలుగేళ్ళు అవుతోంది.అప్పట్లో ఆ చిత్రం కేవలం రాజశేఖర్ అభిమానులను అలరించటానికి తీసింది. ముఖ్యంగా నా పాత్ర పాటలకే పరిమితం. ఆ చిత్రం నన్న బ్యాడ్ గా ప్రాజెక్టు చేసింది. భాక్సాఫీస్ వద్ద నిలబడలేదు..అలాంటి చిత్రాన్నినా జగన్మోహిని చిత్రం రిలీజ్ ముందు రిలీజ్ చేస్తున్నారంటే అర్ధం ఏమిటి..ఇదంతా నా దురదృష్టం..అంటూ వాపోయింది.
ఇక రాజా హీరోగా నమిత, మీరా చోప్రా ప్రధానపాత్రులగా మురళి సినీ ఆర్ట్స్ పతాకంపై హెచ్. మురళి నిర్మించిన చిత్రం 'జగన్మోహిని'. ఎన్.కె. విశ్వనాథన్ దర్శకత్వంలో తెలుగు, తమిళ భాషల్లో ఏకకాలంలో రూపొందిన ఈ సినిమాని ఈనెల 17న విడుదల చేయనున్నామని నిర్మాత తెలిపారు. అలాగే వినోదభరితంగా తయారయిన చిత్రమిది.అండమాన్ దగ్గర సముద్రంలో తీసిన అండర్ వాటర్ సన్నివేశాలు సినిమాకి హైలైట్ అవుతాయి. నమిత నటన, ఆమె గ్లామర్ ఈ సినిమాకి ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తాయి అన్నారు.