Don't Miss!
- News బీఆర్ఎస్కు బిగ్ షాక్.. కాంగ్రెస్ తీర్ధం పుచ్చుకున్న వరంగల్ నగర మేయర్ గుండు సుధారాణి
- Sports SRHకు భయపడి CSK సంచలన నిర్ణయం: ధోనీ మైండ్ గేమ్?
- Finance Stock Market Close: భారీ లాభాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్లు..
- Lifestyle హడలెత్తిస్తున్న Bird Flu పాలు,గుడ్లు మరియు చికెన్ తినడం సురక్షితమేనా?మనుషులకూ వ్యాపిస్తుందా..నిపుణులు ఏమంటారు?
- Technology Infinix GT 20 Pro 5G డిజైన్ రెండర్లు లీక్ అయ్యాయి! స్పెసిఫికేషన్ల వివరాలు
- Automobiles వందేభారత్ రైళ్లలో 1 లీటర్ వాటర్ బాటిల్ రద్దు.. రైల్వే శాఖ కీలక నిర్ణయం
- Travel కేవలం రూ. 5వేలతో హిమాచల్ప్రదేశ్లోని ఈ ప్రాంతాలను చుట్టేయొచ్చు..!
త్రిష ఏ రాత్రి ఎక్కడుంటుందో ...?
స్టార్ హీరోయిన్ త్రిష తాను ఏ రోజు..లేదా ఏ రాత్రి ఎక్కడుంటానో తెలియని పరిస్ధితి నెలకొందని చెప్తోంది. కారణం ఆమె ప్రస్తుతం చేస్తున్న మూడు చిత్రాల్లో రెండు రిలీజుకు దగ్గరపడ్డాయి. ఒక తమిళ సినిమా(విన్నై తాండి వరువాయె), ఓ హిందీ సినిమా(కట్టా-మీటా), ఒక తెలుగు చిత్రం(నమో వెంకటేశ) షెడ్యూల్స్తో ఆమె కాల్షీట్స్ డైరీ నిండిపోయింది. వీటితో పాటు కొత్తగా కమిట్ అవ్వాల్సిన చిత్రాలు కోసం కమిట్మెంట్స్. దాంతో త్రిష... ముంబై, చెన్నైయ్, హైదరాబాద్లకు తిరగడమే టైం సరిపోతోందట.
అందులో ముఖ్యంగా తన గురువు ప్రియదర్శన్ దర్శకత్వంలో అక్షయ్కుమార్ హీరోగా తెరకెక్కుతున్న 'కట్టామీఠా' షూటింగ్ కోసం ఈ మధ్య ముంబయ్లో ఎక్కువ వుంటున్నారు ఆమె. మరో ప్రక్క తమిళ చిత్రం 'విన్నై తాండి వరువాయె' రిలీజుకు దగ్గర పడింది. అదేవిధంగా తెలుగు చిత్రం 'నమో వెంకటేశా' కూడా విడుదలకు ముస్తాబవుతోంది. ఈ మూడు సినిమాల షూటింగ్స్, ప్రమోషన్ కార్యక్రమాల నిమిత్తం త్రిష... ముంబై, చెన్నైయ్, హైదరాబాద్లకు తిరగడమే టైం సరిపోతోందట.
ఈ నెల 18న హైదరాబాద్లో విడుదలవుతున్న 'నమో వెంకటేశా' చిత్రం ఆడియో రిలీజులో పాల్గొని, అదే రోజు రాత్రి లండన్కు బయలు దేరి వెళ్తున్నారట. అక్కడ విడుదలయ్యే 'విన్నైతాండి వరువాయ' చిత్రం ఆడియో ఆవిష్కరణ కార్యక్రమంలో ఆమె పాల్గొంటారట. అక్కడ ఎ.ఆర్.రెహమాన్తో కలవబోతున్నందుకు చాలా ఆనందంగా వుంది అనంతరం ఆమె ముంబయికి చెక్కేస్తుంది..ఎందుకంటే అక్షయ్ కుమార్ తో ఆడిపాడాలిగా...