Don't Miss!
- News ఈ ఒక్కటి ఇంట్లో ఉంటే డబ్బు ఆటోమేటిక్ గా వస్తుంది
- Sports PBKS vs MI: అతను అసాధారణ బ్యాటింగ్తో భయపెట్టాడు: హార్దిక్ పాండ్యా
- Lifestyle గుడ్నైట్ సందేశాలను ఇలా సరదాగా పంపుకోండి..
- Technology 40 గంటలకు పైగా బ్యాటరీ బ్యాకప్, ChatGPT వాయిస్ AI సపోర్టుతో నథింగ్ ఇయర్బడ్స్ విడుదల.. సేల్ వివరాలు!
- Automobiles గొప్ప మనసు చాటుకున్న రాఘవ లారెన్స్.. దివ్యాంగులకు టీవీఎస్ స్కూటర్ల పంపిణీ
- Finance Market Closing: నష్టాల్లోకి జారుకున్న సెన్సెక్స్-నిఫ్టీ.. ఆ రెండిటిపైనే అందరి కన్ను..
- Travel ఒంటిమిట్ట శ్రీ కోదండరామస్వామి ఆలయంలో టీటీడీ అన్నప్రసాదం ప్రారంభం..
ప్రేక్షకులని పలకరించడానికి మళ్ళీ రెడీ అయిపోని గేంబ్లర్ త్రిష..!
అందాల భామ త్రిష త్వరలో అజిత్ తో కలిసి నటించిన చిత్రంతో తెలుగు ప్రేక్షకులని పలకరించడానికి మళ్లీరెడీ అయిపోతోంది. బాలీవుడ్ లో కలిసిరాక దక్షిణాదికే తిరిగి వచ్చింది. అజిత్ 50వ చిత్రంగా రూపొందిన 'మంగత్తా" చిత్రంలో అజిత్ కు జోడీగా త్రిష నటించింది. ఈ చిత్రాన్ని తెలుగులో 'గేంబ్లర్" పేరుతో విడుదల చేయబోతున్నారు.
ఇటీవల 'రంగం", కాంచన, నా పేరు శివ వంటి అనువాద చిత్రాలకు తెలుగులో మంచి ఆదరణ లభించడంతో 'ప్రేమలేఖ" చిత్రం తర్వాత తెలుగులో పెద్దగా మార్కెట్ లేని అజిత్ నటించిన 'మంగత్తా" చిత్రాన్ని తెలుగులో విడుదల చేయడానికి ప్లాన్ చేస్తున్నారు. ప్రస్తుతం తెలుగులో అనువాద చిత్రాల హవా కొనసాగుతున్నందున 'గేంబ్లర్" చిత్రాన్ని త్వరగా విడుదల చేయాలని నిర్మాతలు ప్లాన్ చేస్తున్నారట. ప్రస్తుతం తెలుగులో వెంకటేష్ తో మలయాళ బాడీగార్డ్ రీమేక్ లో నటిస్తున్న త్రిష 'గేంబ్లర్"తో తెలుగు ప్రేక్షకులని ఏవిధంగా అలరిస్తుందో చూద్దాం!