Just In
- 1 hr ago
హాలీవుడ్ చిత్రం గాడ్జిల్లా vs కాంగ్ ట్రైలర్ విడుదల: తెలుగుతో పాటు ఆ భాషల్లో కూడా వదిలారు
- 1 hr ago
మహేశ్ బాబు పేరిట ప్రపంచ రికార్డు: సినిమాకు ముందే సంచలనం.. చలనచిత్ర చరిత్రలోనే తొలిసారి ఇలా!
- 2 hrs ago
ఘనంగా హీరో వరుణ్ వివాహం: సీసీ కెమెరాలు తీసేసి మరీ రహస్యంగా.. ఆయన మాత్రమే వచ్చాడు!
- 3 hrs ago
శ్రీరాముడిపై మోనాల్ గజ్జర్ అనుచిత వ్యాఖ్యలు: అందుకే అలాంటోడిని చేసుకోనంటూ షాకింగ్గా!
Don't Miss!
- Lifestyle
జుట్టు పెరగడానికి నూనె మాత్రమే సరిపోదు, ఇక్కడ మోకాలి పొడవు జుట్టు యొక్క రహస్యం ఉంది
- Finance
Budget 2021: హెల్త్ బడ్జెట్ డబుల్! నిర్మలమ్మ 'ప్రధానమంత్రి హెల్త్ఫండ్?'
- Sports
ఇదంతా ఓ కలలా ఉంది.. చాలా ఒత్తిడికి గురయ్యా: నటరాజన్
- News
షర్మిల కొత్త పార్టీ:చర్చ్ స్ట్రాటజీ: పోప్ జాన్పాల్-2 ప్రసంగంతో లింక్: రెడ్లందరినీ: సీబీఐ మాజీ డైరెక్టర్
- Automobiles
ఘన విజయం సాధించిన ఇండియన్ క్రికెట్ టీమ్కి ఆనంద్ మహీంద్రా స్పెషల్ గిఫ్ట్.. ఏంటో తెలుసా..!
- Technology
వన్ప్లస్ నార్డ్ స్మార్ట్ఫోన్ ప్రీ-ఆర్డర్స్ ఇండియాలో జూలై 15 మధ్యాహ్నం 1.30 గంటల నుండి మొదలు
- Travel
కర్ణాటక జూన్ 1 నుండి ఈ ఆధ్యాత్మిక ప్రదేశాలను తెరవనుంది..
త్రిష రాజీ కి నో అంది... అంతలా ఏం జరిగిందో?
చెన్నై : గత కొద్ది రోజులుగా త్రిష- వరుణ్ మణియన్ల పెళ్లి విషయం హాట్ టాపిక్గా మారిన సంగతి తెలిసిందే. వీరిద్దరి మధ్య పెళ్లికి ముందే అభిప్రాయభేదాలు రావడంతో విడిపోయినట్లు సిని,మీడియా వర్గాలు కోడై కూస్తున్నాయి. ఈ నేపధ్యంలో వీరి సన్నిహితులు ముందుకు వచ్చి...వీరిని కలిపే ప్రయత్నాలు చేస్తున్నట్లు సమాచారం. చిన్న చిన్న అభిప్రాయ భేధాలు ఎవరి మధ్య అయినా సహజమేనని, సర్దుకుపోవాలని రాజీ చేయటానికి ప్రయత్నిస్తున్నట్లు చెప్పుకుంటున్నారు.
ఫేస్బుక్ ద్వారా లేటెస్ట్ అప్డేట్స్ ఎప్పటికప్పుడు
వరుణ్ మణియన్ ...రాజీకు ఇష్టపడినా, త్రిష మాత్రం పట్టుదలగా ఉందని అంటున్నారు. అయితే అసలు వీరిద్దరి మధ్యా ఏం జరిగింది.. అప్పుడే ఎందుకు విడిపోయాలి అనే ఆలోచనకు అప్పుడే ఎందుకు వచ్చారనేది మాత్రం అర్దం కావటంలేదని అంటున్నారు. కానీ సన్నిహితులు మాత్రం...వీరిద్దరూ కలిసి ట్విట్టర్ ద్వారా కానీ ,మీడియా ద్వారా కానీ స్పందిస్తే బాగుంటుందని సూచిస్తున్నారట.

త్రిష.. చిత్ర నిర్మాత వరుణ్ మణియన్తో ప్రేమాయణం సాగించి, నిశ్చితార్థం చెన్నైలో ఈ ఏడాది జనవరి 23న జరిగింది. ఆ తర్వాత సినీ ప్రముఖులు, స్నేహితులకు ఓ నక్షత్ర హోటల్లో విందు కూడా ఇచ్చారు. ప్రస్తుతంఅంతేకాకుండా కొన్ని ప్రముక తమిళ పత్రికలు కూడా వీరిద్దరూ విడిపోయారంటూ వార్తలు ప్రచురించాయి.
ఇటీవల వరుణ్మణియన్ చెల్లెలు వివాహానికి కూడా త్రిష హాజరు కాలేదని, అంతేకాకుండా త్రిష తన చేతిలో ఉన్న నిశ్చితార్థ ఉంగరాన్ని కూడా తీసేశారన్నది ఆ వార్తల సారాంశం. మరోవైపు వీరిద్దర్నీ కలిపేందుకు సన్నిహిత స్నేహితులు ప్రయత్నిస్తున్నట్లు కూడా వార్తలు వినిపిస్తున్నాయి.
త్రిషకు వరుణ్మణియన్తో వివాహ నిశ్చితార్థానికి ముందు పెద్దగా చిత్రాలు లేవు. అంతకుముందు అంగీకరించిన చిత్రాలను పూర్తి చేసి పెళ్లికి సిద్ధం అవ్వాలని ఆమె నిర్ణయించుకున్నట్లు ప్రచారం జరిగింది. అయితే ఆ తరువాత త్రిష నటించిన ఎన్నై అరిందాల్ చిత్రం విడుదలైన హిట్ అవ్వడంతో పాటు ఆమెకు మంచి పేరు వచ్చింది. మేనేజర్ గిరిధర్ నిర్మిస్తున్నారు. త్రిష చిత్రాలు మీద చిత్రాలు అంగీకరించడంతో ఆమె పెళ్లి గురించి రకరకాల వదంతులు ప్రచారం అవుతున్నట్లు ఒక ఆంగ్ల పత్రిక కథనం రాసింది. అయితే ఈ వ్యవహారం గురించి ఇటు త్రిషగాని, అటు వరుణ్మణియన్గాని స్పందించక పోవడం గమనార్హం.
తెలుగు, తమిళ చిత్ర పరిశ్రమలో హవా చాటుకుంటున్న త్రిష.. ఇప్పటికీ వరుస చిత్రాలతో దూసుకుపోతోంది. తెలుగులో బాలకృష్ణ సరసన ఆమె నటించిన 'లయన్' త్వరలోనే విడుదలకు సిద్ధంగా ఉంది. మరోవైపు తమిళంలోనూ కొత్తగా రెండు చిత్రాల్లో నటిస్తోంది.