twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    వాళ్ళను వదలి పెట్టేది లేదు...త్రిష వార్నింగ్

    By Srikanya
    |

    హాట్ స్టార్ త్రిషకు ఎప్పుడోగానీ కోపం రాదు...వచ్చిందంటే మాత్రం మనిషి కాదు అంటూంటారు ఆమె దగ్గర వాళ్ళు. అలాంటి త్రిషకు రీసెంట్ గా ఓ రేంజిలో కోపం వచ్చింది. ఎవరి మీద అంటే అజ్ఞాత వ్యక్తుల మీద. ఏంటి విషయం అంటే...ఈ మధ్య త్రిష ట్విట్టర్ ‌లో చేరి ఫ్యాన్స్ తో టచ్‌ లో ఉంటోంది. అయితే త్రిష పేరుతోనే ఎవరో మరో ఖాతా ప్రారంభించారు. దాంతో త్రిషకు వెళ్లవలసిన మెసేజ్ లన్నీ దారి తప్పుతున్నాయి. ఈ సంగతి తెలుసుకున్న త్రిషకు తెగ కోపం వచ్చేసింది. 'ఇది చాలా దారుణం. ఇది కాపీ రైట్‌ చట్టం కింద నేరం. ఎవరో నా అభిమానుల్ని తప్పుదోవ పట్టిస్తున్నారు' అని వాపోయింది. 'ఇందుకు బాధ్యులైనవారిని వదలను' అంటూ సీరియస్ అయింది. ఇందుకోసం ఆమె లాయిర్ ని సైబర్ నిపుణులను, పోలీసులను సంప్రదించనున్నట్లు తెలిపింది. ఇక తాజా సినిమా సంగతులు చెబుతూ 'కమల్‌ హాసన్‌ తో త్వరలోనే ఓ సినిమా చేస్తున్నా. జూన్‌ లో ప్రారంభమవుతుంది. ఆ సినిమా కోసం ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నా' అంది. త్రిష ప్రస్తుతం ప్రియదర్శన్ దర్శకత్వంలో కట్టా మీటా చిత్రంలో చేస్తోంది. అలాగే బాలకృష్ణ, పూరీ జగన్నాద్ కాంబినేషన్లో రూపొందే చిత్రం కోసం కూడా ఆమెను సంప్రదించారని తెలుస్తోంది. కమల్ తో త్రిష చేయబోయే చిత్రం టైటిల్ 'యావరుమ్ కేళీర్' (అందరూ వినండి). 'దశావతారం' దర్శకుడు కె.ఎస్.రవికుమార్ డైరక్షన్ లో రానున్న ఈ చిత్రానికి ఉదయనిధి స్టాలిన్ నిర్మాత. ఈ విషయంపై త్రిష కూడా చాలా హ్యాపీగా ఉంది.

     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X