Don't Miss!
- News అభ్యర్దుల మార్పు పై చంద్రబాబు కీలక నిర్ణయం - ఆ నేతలకు పిలుపు..!!
- Sports అందుకే ధోనీ ముందుగా బ్యాటింగ్కు రావట్లేదు- CSK కోచ్
- Finance IREDA: భారీగా లాభాలను ప్రకటించిన ఐఆర్ఈడీఏ..
- Automobiles మరింత తక్కువ ధరలో బజాజ్ చేతక్ ఇ స్కూటర్.. త్వరలో లాంచ్.!!
- Technology Dell నుంచి నాలుగు కొత్త Ai ల్యాప్టాప్లు! ధర,స్పెసిఫికేషన్లు
- Lifestyle వేసవిలో కిడ్నీలు భద్రంగా ఉండాలంటే రోజూ ఎన్ని గ్లాసుల నీళ్లు తాగాలో తెలుసా?
- Travel తెలంగాణలోని గొంతెమ్మగుట్ట సందర్శనకు బయలుదేరుదామా..?
త్రిష్ స్పెషల్ కేర్
క్యూట్ గా కనిపించే త్రిష హిందీ చిత్రం 'కట్టా మీటా" లో కథానాయికగా ఎంపికైన విషయం తెలిసిందే. ఈ చిత్రం షూటింగ్ అక్టోబర్ 1 నుంచి ఆరంభం కానుందని వినికిడి. ఈలోపు బాలీవుడ్ కి తగ్గట్టుగా తయారవ్వడానికి త్రిష సన్నాహాలు మొదలు పెట్టింది. కఠినమైన ఆహార నియమాలు, వర్కవుట్లు చేస్తోందట. వీటితో పాటు రోజూ యోగా కూడా చేస్తోందని వినికిడి. ప్రస్తుతం తెలుగులో వెంకటేష్ సరసన నమో వెంకటేశా చిత్రంలో నటిస్తోంది. గోపీచంద్ సరసన 'శంఖం" సినిమాలో నటించిన త్రిష ఆ చిత్రం పై చాలా ఆశలు పెట్టుకుంది.
తెలుగులో అనుష్క, ఇలియనా, కాజల్ కి హీరోయిన్ గా మంచి డిమాండ్ రావడంతో తనకు అవకాశాలు తగ్గిపోతాయన్న కోణంలోనే త్రిష తన రెమ్యునరేషన్ని తగ్గిచుకునేందకు సిద్దమవుతున్నట్లు సమాచారం. 'శంఖం" సినిమా సక్సన్ అయితే మళ్ళీ రెమ్యునరేషన్ని పెంచే విషయమై నిర్ణయం తీసుకుంటుందట. తప్పదుమరి డిమాండ్ వున్నప్పుడు రేటు పెంచేసినా, డిమాండ్ తగ్గితే రేటు తగ్గించేయాల్సిందే.