Don't Miss!
- News UN On Arvind Kejriwal: కేజ్రివాల్ అరెస్టుపై స్పందించిన ఐరాస-భారత్ కు కీలక సూచన..!
- Sports ఖమ్మం క్లాసెన్..మెదక్ మార్క్రమ్: క్రియేటివిటీ కొట్టేవాడే లేడు భయ్యా
- Lifestyle Lok Sabha Election 2024:మరో 3 నెలల్లో పట్టాభిషేకం ఎవరికి? జ్యోతిష్యం ఏ పార్టీకి స్ట్రాంగ్ గా సపోర్ట్ చేస్తోంది
- Automobiles కూతురిపై ప్రేమ - కోట్ల రూపాయల కారు గిఫ్ట్ ఇచ్చిన తండ్రి వీడియో
- Finance Essential Medicines: ఏప్రిల్ 1 నుంచి పెరగనున్న అవసరమైన ఔషధాల ధరలు..
- Technology రూ.12వేల కంటే తక్కువ ధరకే స్మార్ట్ఫోన్.. సెగ్మెంట్లో తొలిసారిగా 45W ఫాస్ట్ ఛార్జింగ్, డ్యూయల్ స్పీకర్లు..!
- Travel చారిత్రాత్మకమైన నగరమైన గ్వాలియర్లో సందర్శించాల్సిన ప్రదేశాలివే..!
అధికార పార్టీ పగపట్టి తన సినిమాలు ప్లాఫ్ చేస్తోందంటూ స్టార్ హీరో
తమిళ సూపర్ స్టార్ విజయ్ చిత్రాన్ని విడుదల కానివ్వకుండా చేసి ఉదయనిధి సొంత సినిమా కమలహాసన్ నటించిన మన్మధన్ అన్బు(మన్మధ బాణం) విడుదల చేయిస్తున్నారని కోలీవుడ్ లో అంతటా వినపడుతోంది..దీంతో విజయ్ తీవ్ర మన స్తాపం చెంది, జయలలిత సహాయం కోరనున్నట్లు తెలిసింది. ఇందునిమిత్తం వచ్చే ఎన్నికల్లో తాము అన్నాడీఎంకేకు మద్దతు ఇస్తామని ఒప్పందం కుదుర్చుకోనున్నారు. అకస్మాత్తుగా విజయ్ ఈ నిర్ణయం తీసుకోవడం వెనుక బలమైన కారణమే ఉంది. విజయ్ నటించిన కావలన్ చిత్రం కొంత కాలంగా విడుదలకు కావటంలేదు. అంతేగాకుండా ఆయన నటించిన చిత్రాలు వరసగా ఫ్లాప్ అవుతున్నాయి. అందులో డిస్ట్రిబ్యూటర్స్ కుట్ర ఉందని విజయ్ అనుమానిస్తున్నారు. అంతేగాక తనీ స్ధితికి అధికార పార్టీ తనపై పగ పట్టడమే కారణమని విజయ్ భావిస్తున్నారు.
కరుణానిధి మనుమడు, ఉప ముఖ్యమంత్రి ఎంకె.స్టాలిన్ కుమారుడు ఉదయనిధి ఇటీవల తమిళ సినిమా పరిశ్రమలో దూసుకుపోతున్న సంగతి తెలిసిందే. ఆయనకు, విజయ్కు ఇటీవల గొడవలు జరిగినట్లు సమాచారం. దీంతో కావలన్ చిత్రం విడుదల కాకుండా ఉదయనిధి ప్రయత్నిస్తున్నారని ఆయన భావిస్తున్నారు. ఈ చిత్రానికి అడ్డుపుల్ల వేసేందుకు ఉదయనిధి డిస్ట్రిబ్యూటర్లతో కుమ్మక్కు అయ్యారని తెలిసింది.దాంతో విజయ్ కొత్త రాజకీయ పార్టీ ప్రారంభించేందుకు కసరత్తు చేస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. అయితే ఎక్కడిక్కడ ఆయనకు ఆటంకాలు ఎదురవుతున్నాయి. ఆయన్ను రాజకీయాల్లోకి రాకుండా అడ్డుకోవాలని డీఎంకే ప్రయత్నాలు చేస్తున్నట్లు తెలుస్తోంది. ఈ పరిస్థితుల్లో విజయ్ ఇటీవల తన అభిమానులతో సమావేశమయ్యారు.
వచ్చే ఎన్నికల్లో అన్నాడీఎంకేకు మద్దతు ఇవ్వడానికి నిర్ణయించుకున్నట్లు తెలి సింది. ఈ మేరకు ఆయన ఆ పార్టీ అధినేత్రి జయలలితకు సందేశం పంపనున్నట్లు సమాచారం.తన తండ్రి, ప్రముఖ దర్శకుడు ఎస్ఎ.చంద్రశేఖరన్ను జయలలిత వద్దకు పంపే ఆలోచనలు ఉన్నారు. ఈ విషయాన్ని అన్నాడీఎంకే నాయకులు కూడా ధ్రువీకరించారు. చంద్రశేఖర్ జయలలిత అపాయింట్మెంట్ను కోరి నట్లు సమాచారం.