Don't Miss!
- News ఎన్నికల వేళ రేవంత్ కీలక నిర్ణయం - నేరుగా రంగంలోకి..!!
- Lifestyle Happy Birthday Wishes : పుట్టినరోజు శుభాకాంక్షలను ఇలా అందంగా తెలపండి..
- Finance Market Closing: నష్టాల్లోకి జారుకున్న సెన్సెక్స్-నిఫ్టీ.. ఆ రెండిటిపైనే అందరి కన్ను..
- Sports CSK Playing XI: స్టార్ ప్లేయర్పై వేటు.. LSGతో ఆడే తుదిజట్టు ఇదే
- Technology వన్ప్లస్ 11R 5G కొత్త వేరియంట్ విడుదల.. అమెజాన్లో ఈ కార్డులపై రూ.1000 తగ్గింపు..!
- Automobiles జనాలు ఎక్కువగా కొంటున్న టాప్-3 SUVలు ఇవే.. జాబితాలో లేని టాటా కార్లు!!
- Travel ఒంటిమిట్ట శ్రీ కోదండరామస్వామి ఆలయంలో టీటీడీ అన్నప్రసాదం ప్రారంభం..
హీరోని విమర్శించినందుకు స్టార్ కమిడియన్ పై దాడి
స్టార్ హీరో విజయ్కాంత్కు వ్యతిరేకంగా ప్రసంగించడంతో హాస్యనటుడు వడివేలుపై గుర్తు తెలియని వ్యక్తులు రాళ్లు విసిరారు.మరో ఘటనలో కూడా ఆయన ప్రచార వాహనంపై దాడి జరిగింది. రామనాథపురం జిల్లా ముదుకుళత్తూరు డీఎంకే అభ్యర్థి సత్యమూర్తికి మద్దతుగా వడివేలు సోమవారం రాత్రి తమిళనాడులోని కముదిలో ఎన్నికల ప్రచారం చేశారు. ఈ సందర్భంగా ఆయన స్థానిక బస్టాండులో వ్యాను పైనుంచి ప్రచారం చేస్తూ డీఎండీకే అధ్యక్షుడు విజయ్కాంత్ను విమర్శించారు. ఆ సమయంలో జనం మధ్య నుంచి ఆయనపైన కొందరు రాళ్లు రువ్వారు. దీంతో అక్కడ కలకలం రేగింది. చివరకు వడివేలు ప్రచారం ముగించుకొని శివగంగై వెళ్లిపోయారు. మరో ప్రక్క మరో కమిడియెన్...సెంధిల్ ...ఒకప్పటి హీరోయన్ ఖుష్బూ పై విరుచుకుపడ్డారు.పెళ్లికి ముందు సెక్స్ ఆమోదయోగ్యమే అంటూ సంచలన వ్యాఖ్యలు చేసినప్పుడు ఖుష్బూను తూర్పారబట్టిన పీఎంకే, వీసీకే పార్టీ నేతలు ఇప్పుడు ఆమె ప్రచారం చేస్తున్న పార్టీకి ఎలా మద్దతుగా నిలిచారని నిలదీశారు.