Don't Miss!
- Technology ఆంధ్రప్రదేశ్ లో 7.9 మిలియన్ల 5G యూజర్ లతో, Airtel మరో రికార్డు! 5G విస్తరణ వివరాలు
- News సచివాలయ ఉద్యోగులకు ఎన్నికల విధులపై కీలక నిర్ణయం..!!
- Lifestyle ఈ రోజు రాశి ఫలాలు: ఓ రాశి వారు తొందరపాటు నిర్ణయాలు తీసుకోకండి..సమస్యలు పెరుగుతాయి
- Finance Gold Rate: మిసైల్ వేగంతో పెరిగిన పసిడి.. నిన్న పడింది నేడు పుంజుకుంది..
- Automobiles 25 దేశాల్లో రాయల్ ఎన్ఫీల్డ్ బైక్ రెంటల్స్ అండ్ టూర్స్ సర్వీస్.. RE ఫ్యాన్స్కు పండగే
- Sports వరుస పరాజయాల వేళ.. ఆర్సీబీ, కోహ్లీ ఫ్యాన్స్కు గుడ్ న్యూస్
- Travel ఒంటిమిట్ట శ్రీ కోదండరామస్వామి ఆలయంలో టీటీడీ అన్నప్రసాదం ప్రారంభం..
హీరోని విమర్శించినందుకు స్టార్ కమిడియన్ పై దాడి
స్టార్ హీరో విజయ్కాంత్కు వ్యతిరేకంగా ప్రసంగించడంతో హాస్యనటుడు వడివేలుపై గుర్తు తెలియని వ్యక్తులు రాళ్లు విసిరారు.మరో ఘటనలో కూడా ఆయన ప్రచార వాహనంపై దాడి జరిగింది. రామనాథపురం జిల్లా ముదుకుళత్తూరు డీఎంకే అభ్యర్థి సత్యమూర్తికి మద్దతుగా వడివేలు సోమవారం రాత్రి తమిళనాడులోని కముదిలో ఎన్నికల ప్రచారం చేశారు. ఈ సందర్భంగా ఆయన స్థానిక బస్టాండులో వ్యాను పైనుంచి ప్రచారం చేస్తూ డీఎండీకే అధ్యక్షుడు విజయ్కాంత్ను విమర్శించారు. ఆ సమయంలో జనం మధ్య నుంచి ఆయనపైన కొందరు రాళ్లు రువ్వారు. దీంతో అక్కడ కలకలం రేగింది. చివరకు వడివేలు ప్రచారం ముగించుకొని శివగంగై వెళ్లిపోయారు. మరో ప్రక్క మరో కమిడియెన్...సెంధిల్ ...ఒకప్పటి హీరోయన్ ఖుష్బూ పై విరుచుకుపడ్డారు.పెళ్లికి ముందు సెక్స్ ఆమోదయోగ్యమే అంటూ సంచలన వ్యాఖ్యలు చేసినప్పుడు ఖుష్బూను తూర్పారబట్టిన పీఎంకే, వీసీకే పార్టీ నేతలు ఇప్పుడు ఆమె ప్రచారం చేస్తున్న పార్టీకి ఎలా మద్దతుగా నిలిచారని నిలదీశారు.