Don't Miss!
- Technology వన్ప్లస్ 11R 5G కొత్త వేరియంట్ విడుదల.. అమెజాన్లో ఈ కార్డులపై రూ.1000 తగ్గింపు..!
- News ఆ నలుగురిపై టీడీపీ గురి - జగన్ సమర్ధతకు సవాల్..!!
- Automobiles జనాలు ఎక్కువగా కొంటున్న టాప్-3 SUVలు ఇవే.. జాబితాలో లేని టాటా కార్లు!!
- Finance 9 రోజులుగా 54 శాతం పెరిగిన స్టాక్.. బ్రోకరేజ్ తాజా టార్గెట్ ధర ఇదే.. మీరూ కొంటున్నారా..??
- Sports CSK జట్టులో కొత్త ప్లేయర్: రోహిత్-కోహ్లి వికెట్లు తీసిన ఘనుడు
- Lifestyle Gruha Pravesham Wishes in Telugu : గృహప్రవేశం శుభాకాంక్షలను ఇలా తెలపండి..
- Travel ఒంటిమిట్ట శ్రీ కోదండరామస్వామి ఆలయంలో టీటీడీ అన్నప్రసాదం ప్రారంభం..
నా ప్రాణానికి ముప్పు...హాస్య నటుడు వడివేలు
కో ఆర్టిస్టు సింగముత్తు వల్ల తన ప్రాణాలకు ముప్పు వాటిల్లే అవకాశముందని, అందుకే అతన్ని చట్ట ప్రకారం అరెస్టు చేయాలని తమిళ హాస్య నటుడు వడివేలు కోరారు. అది జరిగిన నాడే తనకు ప్రశాంతత చేకూరుతుందని అన్నారు. తనను మోసం చేయడమే కాకుండా ప్రతిష్టను దిగజార్చాడని వడివేలు మీడియా ముందు ఆవేదన వ్యక్తం చేశారు. ఆయన బుధవారం తొమ్మిదవ మెట్రోపాలిటన్ మెజి స్ట్రేట్ కోర్టులో హాజరయ్యారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ సింగముత్తు చేసిన పని తనను మానసిక ఆందోళనకు గురిచేసిందని తెలి పారు. సింగముత్తు గతంలో అనేక మందిని మోసం చేశారని ఆరోపించారు. అతన్ని కోర్టు శిక్షిస్తుందని ఆశిస్తున్నానన్నారు.
దీనికి ముందు వడివేలు తర ఫు న్యాయవాది పాల్ కనకరాజ్ కోర్టులో పిటిషను దాఖలు చేశారు. ఈ పిటిషన్లో సింగముత్తు ఇటీవల కొన్ని తమిళ పత్రికల్లో ఇచ్చిన ఇంటర్వ్యూల్లో తన ప్రతిష్టను దిగజార్చే విధంగా వ్యాఖ్యానాలు చేసినట్లు తెలిపారు. దీనికిగాను తాను దాఖలు చేసిన పరువునష్టం దావాకు ఇంతవరకు సమాధానం రాలేదని పేర్కొన్నారు. సింగముత్తు తనకు ఏడు కోట్ల రూపాయల మేర నష్టం చేకూర్చాడని ఆరోపించారు. ఆయన తనపై చేసిన వ్యాఖ్యలకు గాను సెక్షన్ 499, 500 ప్రకారం అరెస్టు చేయాలని కోరారు. ఈ పిటిషన్ను స్వీకరించిన కోర్టు వచ్చే నెల మూడవ తేదీకి వాయిదా వేశారు.