Don't Miss!
- News కేసీఆర్కు మరో షాక్: బీఆర్ఎస్కు కడియం శ్రీహరి, కావ్య గుడ్బై, వరంగల్ కాంగ్రెస్ ఎంపీగా బరిలో
- Sports RR vs DC: రఫ్ఫాడించిన ఆవేశ్ ఖాన్.. ఓడిపోయే మ్యాచ్లో గెలిచిన రాజస్థాన్ రాయల్స్!
- Lifestyle Love Horoscope For April 2024:ఈ రాశులకి ఏప్రిల్ లో LOVE సక్సెస్ అవుతుంది..మరికొందరికి అడ్డంకులు తప్పవు
- Technology రియల్మి కొత్త ఫోన్ టీజర్ విడుదల.. సెగ్మెంట్లోనే సన్నని డిజైన్ సహా కీలక ఫీచర్లు..!
- Automobiles 6 కోట్ల కస్టమర్లతో భారత్లో హోండా తిరుగులేని రికార్డు.. ఎక్కువగా వీటిపైనే క్రేజ్.!!
- Finance Stock Market: లాభాల్లో ముగిసిన సూచీలు.. మార్కెట్ ర్యాలీకి 5 కారణాలివే..
- Travel చారిత్రాత్మకమైన నగరమైన గ్వాలియర్లో సందర్శించాల్సిన ప్రదేశాలివే..!
చిత్రంపై వీరప్పన్ భార్య వాదన కొట్టేసిన హై కోర్టు
ఈ చిత్రం నిర్మాణ కార్యక్రమాలు పూర్తి చేసుకుని చాలా కాలమైంది. ఈ చిత్రం విడుదలపై గం ధపు చెక్కల స్మగ్లర్ వీరప్పన్ భార్య ముత్తులక్ష్మి వ్యతిరేకత వ్యక్తం చేశారు. అలాగే చిత్రాన్ని నిషేధించాలని కోరుతూ చెన్నై సిటీ సివిల్ కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ కోర్టు వనయుద్ధం చిత్రంపై తాత్కాలిక స్టేను విధించింది. ఈ తీర్పు ను వ్యతిరేకిస్తూ చిత్ర దర్శక నిర్మాత హైకోర్టులో అప్పీల్ చేశారు. ఇందులో ఆయన తరపు న్యాయవాది ఎ.నటరాజన్ హాజరై వీరప్పన్ గురించి ప్రచారమైన వార్తలను ఇతివృత్తంగా తీసుకుని వనయుద్ధం చిత్రాన్ని తెరకెక్కించామని పేర్కొన్నారు.
తన కుటుంబానికి వనయుద్ధం వల్ల కళంకం ఏర్పడుతుందనే ముత్తులక్ష్మి వాదన సరైంది కాదన్నారు. ఈ కేసును విచారించిన హైకోర్టు న్యాయమూర్తి రామనాథన్ కింది కోర్టులో విధించిన నిషేధాన్ని తొలగిస్తూ శుక్రవారం ఉత్తర్వులు జారీ చేశారు. ఈ సందర్భంగా ఆయన పేర్కొంటూ వీరప్పన్ భార్య ముత్తులక్ష్మి అభ్యంతరం తెలిపిన సన్నివేశాలను వనయుద్ధం చిత్రం నుంచి తొలగించడానికి దర్శక నిర్మాత సమ్మతించారని తెలిపారు. దీంతో చిత్రంపై నిషేధం తొలగిస్తూ ఉత్తర్వులు జారీ చేసినట్లు పేర్కొన్నారు. వనయుద్ధం చిత్రా న్ని ఈ నెల 15న విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నట్లు ఏఎంఆర్ రమేష్ తెలిపారు.